
లెఫ్టార్మ్ బలహీనతపై..
ఈ క్రమంలోనే ఈ సమస్యను సరిదిద్దే ప్రణాళికను రాహుల్ ద్రవిడ్ సిద్దం చేశాడు. భారత బ్యాటర్లు లెఫ్టార్మ్ పేసర్లను ఎదుర్కోవడానికి గల కారణాన్ని గుర్తించిన దివాల్.. జట్టులో సరైన లెఫ్టార్మ్ పేసర్ లేకపోవడంతోనే భారత బ్యాటర్లు విఫలమవుతున్నారని గ్రహించాడు. జహీర్ ఖాన్ రిటైర్మెంట్ తర్వాత ఆ స్థాయిలో మరో ఎడమ చేతివాటం పేసర్ను భారత జట్టు తయారుచేయలేకపోయింది. ఇర్ఫాన్ పఠాన్ కొన్నాళ్లు ఆశలు రేపినా ఆ తర్వాత సరైన అవకాశాలు అందిపుచ్చుకోలేకపోయాడు. దీంతో కొన్నాళ్లుగా సరైన లెఫ్టార్మ్ బౌలర్ లేకుండానే ఆడుతున్న భారత జట్టుకు అర్ష్దీప్ సింగ్ రూపంలో ఓ బౌలర్ దొరికాడు.

చేతన్, ముకేశ్కు పిలుపు..
అర్ష్దీప్ సింగ్ ఒక్కడిపైనే ఆధారపడటం కరెక్ట్ కాదని గ్రహించిన రాహుల్ ద్రవిడ్.. మరో ఇద్దరు లెఫ్టార్మ్ పేసర్లను నెట్బౌలర్లుగా ఎంచుకున్నాడు. ముందుగా వారిని సౌతాఫ్రికాతో వన్డే సిరీస్కు ఎంపిక చేశాడు. ఐపీఎల్లో రాజస్థాన్ రాయల్స్ తరుపున ఆరంగ్రేటం చేసి అదరగొట్టిన ఛేతన్ సకారియాతో పాటు దేశవాళీ క్రికెట్లో సత్తా చాటుతున్న ముకేశ్ కుమార్లను నెట్బౌలర్లుగా తీసుకున్నాడు. ఈ ఇద్దరు భారత జట్టుతో కలిసి ఆస్ట్రేలియాకు వెళ్లనున్నారు.

నెట్స్లో ప్రాక్టీస్..
ప్రస్తుతం ఇరానీ ట్రోఫీ 2022లో సౌరాష్ట్ర తరుపున ఆడిన ఛేతన్ సకారియా తొలి ఇన్నింగ్స్లో 5 వికెట్లు తీసి ఆకట్టుకున్నాడు. ముకేశ్ కుమార్ ఇరానీ ట్రోఫీలో రెస్ట్ ఆఫ్ ఇండియా జట్టు తరుపున తొలి ఇన్నింగ్స్లో 4 వికెట్లు తీశాడు. నెట్స్లో భారత బ్యాటర్లకు వీరి చేత బౌలింగ్ చేయించి భారత బ్యాటర్ల బలహీనతను పోగెట్టే ప్రయత్నం ద్రవిడ్ చేయనున్నాడు. మరీ ఈ ప్లాన్ ఎంత వరకు వర్కౌట్ అవుతోందో చూడాలి.


Click it and Unblock the Notifications
