హైదరాబాద్: టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ మధ్య విభేదాలున్నాయంటూ గతేడాది వరకు సోషల్ మీడియా వేదికగా జోరుగా ప్రచారం జరిగేది. టీమిండియా కెప్టెన్గా విరాట్ కోహ్లీ కొనసాగినన్ని రోజులు రోహిత్ ఎడమోహం పెడ మోహంగా ఉండటం.. సోషల్ మీడియా వేదికగా ఈ ఇద్దరి ఆటగాళ్ల సతీమణులు ఒకరినొకరు అన్ఫాలో చేసుకోవడం.. ఐపీఎల్ 2020 సీజన్లో టాస్ సందర్భంగా ఒకరికొకరు చూసుకోకపోవడం ఈ వార్తలకు బలం చేకూర్చింది.
అంతేకాకుండా ఆస్ట్రేలియా పర్యటనకు రోహిత్ శర్మ ఎందుకు రాలేదో తనకు తెలియదని ప్రెస్ మీట్లో విరాట్ కోహ్లీ చెప్పడంతో ఈ ఇద్దరి మధ్య గొడవలు నిజమేనని అంతా అనుకున్నారు.