
సర్ఫరాజ్ సూపర్ బ్యాటింగ్..
ఈ క్రమంలోనే సర్ఫరాజ్ ఖాన్ గురించి తన యూట్యూబ్ చానెల్ వేదికగా మాట్లాడిన అశ్విన్.. సెలెక్టర్లపై వ్యంగ్యాస్త్రాలు సంధించాడు.'సర్ఫరాజ్ ఖాన్ గురించి ఏమని, ఎక్కడని మొదలుపెట్టను? సర్ఫరాజ్ ఖాన్... అతను టీమిండియాకు సెలక్ట్ అవుతాడా? కాడా? అన్న అంశం గురించి పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది. అయితే, తనకు ఇవేమీ పట్టవు.
సర్ఫరాజ్ 2019-20 సీజన్లో 900 పరుగులు చేశాడు. 2020-21 సీజన్లోనూ 900 పరుగులు.ఇక ఈసారి సుమారుగా 600 రన్స్. తన అత్యద్భుత ప్రదర్శనతో సెలక్టర్లకు గట్టి సవాల్ విసురుతున్నాడు'అని అశ్విన్ చెప్పుకొచ్చాడు.

సెలెక్టర్లకు తలనొప్పిలా..
రంజీల్లో అతని ఆటతీరును కొనియాడుతూ ఆకాశానికెత్తాడు. వాళ్లకు కేవలం తలనొప్పి మాత్రమే కాదు.. కోపం కూడా తెప్పిస్తున్నాడంటూ తనదైన శైలిలో బీసీసీఐ సెలక్టర్లపై సెటైర్లు వేశాడు. 'గత మూడు రంజీ సీజన్లలో అతని స్ట్రైక్రేటు బాగుంది. సగటు 100కి పైగా ఉంది. ప్రతి సీజన్లోనూ మెరుస్తున్నాడు. సర్ఫరాజ్ ఖాన్ కేవలం సెలక్షన్ కమిటీ డోర్లను బాదడం కాదు. సెలక్టర్లకు ఓ రకంగా కోపం తెప్పించేలా తలనొప్పిలా తయారయ్యాడు.
కానీ దురదృష్టవశాత్తూ ఈసారి కూడా తను జట్టుకు ఎంపిక కాలేదు. అయితేనేం, తన ఆట తనది. దేనికి కుంగిపోకుండా విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడుతూ తన పని తాను చేసుకుపోయాడు. ముఖ్యంగా ఢిల్లీ మ్యాచ్లో తన బ్యాటింగ్ అద్భుతం. ముంబై ఆ మ్యాచ్లో ఓడినప్పటికీ సర్ఫరాజ్ ఇన్నింగ్స్ మర్చిపోలేం'' అని అశ్విన్ కొనియాడాడు.

సర్ఫరాజ్కు బదులు సూర్య..
సర్ఫరాజ్ ఖాన్కు బదులు సూర్యకుమార్ యాదవ్, ఇషాన్ కిషన్కు అవకాశం దక్కింది. అయితే దేశవాళీ క్రికెట్లో నిలకడగా రాణిస్తున్న సర్ఫరాజ్ ఖాన్కు అవకాశం ఇవ్వాల్సిందని సునీల్ గవాస్కర్ వంటి మాజీ క్రికెటర్లు అభిప్రాయపడ్డారు. గత మూడు రంజీ సీజన్లలో అతని యావరేజ్ 100కిపైగా ఉండటం గమనార్హం.
ఈ సీజన్లో సర్ఫరాజ్ ఖాన్ ఇప్పటికే మూడో సెంచలు నమోదు చేశాడు. హైదరాబాద్పై 126 పరుగులతో నాటౌట్గా నిలిచిన ముంబై క్రికెటర్.. తమిళనాడుపై 162, ఢిల్లీతో 125 పరుగులు చేశాడు. ఈ ముంబై క్రికెటర్ రంజీ ట్రోఫీలో గత 23 ఇన్నింగ్స్ల్లో 10 శతకాలు నమోదు చేయడం విశేషం.


Click it and Unblock the Notifications
