
మాకు క్రెడిట్ ఇవ్వాల్సిందే..
'ఐసీసీ టోర్నీల్లో భారత్తో మ్యాచ్ అంటే ఎప్పుడూ పాకిస్థాన్ అండర్ డాగ్గానే ఉండేది. ఒత్తిడి తీసుకొని భారత్తో మ్యాచుల్లో ఓడిపోతూ వచ్చేవాళ్లం. కొన్నాళ్లకు ఐసీసీ టోర్నీల్లో భారత్ను ఓడించగలమా? అనే అనుమానం కూడా మాలో మొదలైంది. టీమిండియాను ఓడించలేమని చాలామంది ఫిక్స్ అయ్యారు కూడా. అయితే గత వరల్డ్ కప్లో దాన్ని సాధించాం. టీమిండియాను ఓడించి అద్భుతం క్రియేట్ చేశాం. అది అనుకోకుండా వచ్చిన విజయమే కావచ్చు కానీ అందులో మాకు క్రెడిట్ దక్కాల్సిందే... ఎందుకంటే టీమిండియా బిలియన్ డాలర్ టీమ్ క్రికెట్ ఇండస్ట్రీ.'అంటూ రమీజ్ రాజా కామెంట్ చేశాడు.

గెలుపు ఓటములు సహజం..
ఈ వ్యాఖ్యలపై అశ్విన్ తనదైన శైలిలో స్పందించాడు. ఓ క్రికెటర్గా రమీజ్ రాజా ఇలా మాట్లాడాల్సింది కాదని అభిప్రాయపడ్డాడు. 'రమీజ్ రాజా చేసిన వ్యాఖ్యలు విని షాక్ అయ్యా. ఈ విషయాన్ని డీల్ చేసే విధానం ఇదేనా? క్రికెట్ గేమ్లో గెలుపు ఓటములు సహజం. పొలిటికల్ టెన్షన్స్ కారణం కావచ్చు, మరేదైనా కారణం కావచ్చు.. భారత్, పాకిస్థాన్ మధ్య మ్యాచ్ అంటే ఆ ఆసక్తి వేరుగా ఉంటుంది. రెండు జట్ల మధ్య మ్యాచ్లా కాకుండా రెండు దేశాల మధ్య పోరాటం చూస్తారు చాలా మంది. అయితే ఓ క్రికెటర్గా ఆటలో గెలుపు ఎంత సహజమో, ఓటమి కూడా అంతే అనే విషయం నాకు బాగా తెలుసు. అందులోనూ టీ20ల్లో ఎవరు ఎప్పుడు గెలుస్తారో చెప్పడం చాలా కష్టం.

అడిగి తెచ్చుకునేది కాదు..
క్రెడిట్ కానీ, గౌరవం కానీ అడిగి తీసుకుంటే వచ్చేది కాదు. గెలుపు ఓటములతో గౌరవం దక్కదు. ప్రత్యర్థితో మనం ఎలా ఉంటున్నాం, ఎలా వ్యవహరిస్తున్నాం, ఎలా మాట్లాడుతున్నాం.. అనేదాన్ని బట్టి గౌరవం దక్కుతుంది. ఓ క్రికెటర్గా, నా ప్రత్యర్థి జట్టును నేను గౌరవిస్తా, అది పాకిస్థాన్ అయినా కావచ్చు, అఫ్గానిస్తాన్ అయినా కావచ్చు. అయితే దాన్ని నిలబెట్టుకోవాల్సిన బాధ్యత వాళ్లపైనే ఉంది.' అని అశ్విన్ చాలా హుందాగా చురకలంటిచ్చాడు.


Click it and Unblock the Notifications












