టీమిండియా వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ను వరల్డ్ రికార్డ్ ఊరిస్తోంది. సౌతాఫ్రికాతో మంగళవారం నుంచి ప్రారంభం కానున్న రెండు టెస్ట్ల సిరీస్లో అశ్విన్ మరో 11 వికెట్లు తీస్తే.. సుదీర్ఘ ఫార్మాట్లో 500 వికెట్ల మైలురాయిని అందుకోనున్నాడు. ఈ ఫీట్ సాధించిన రెండో భారత బౌలర్గా చరిత్రకెక్కనున్నాడు.
ప్రస్తుతం అశ్విన్ 489 వికెట్లతో ఉన్నాడు. 94 మ్యాచ్ల్లో అతను ఈ వికెట్లను సాధించాడు. అశ్విన్ కన్నా ముందు అనిల్ కుంబ్లే ఈ ఫీట్ సాధించాడు. అతను 132 మ్యాచ్ల్లో 619 వికెట్లు పడగొట్టాడు. ఓవరాల్గా 500 వికెట్ల క్లబ్లో చేరిన 9 బౌలర్గా అశ్విన్ నిలవనున్నాడు. అశ్విన్ కన్నా ముందు మురళీదరణ్(800), షేన్ వార్న్(708), జేమ్స్ అండర్సన్(690), అనిల్ కుంబ్లే(619), స్టువర్ట్ బ్రాడ్(604), గ్లేన్ మెక్గ్రాత్(563), వాల్ష్(519), నాథన్ లియోన్(501) ఉన్నారు.

సౌతాఫ్రికాతో మంగళవారం జరిగే మ్యాచ్లో అశ్విన్ ఈ ఫీట్ సాధిస్తే వరల్డ్ రికార్డ్ను తన పేరిట లిఖించుకోనున్నాడు. అయితే ఈ మ్యాచ్ తుది జట్టులో అశ్విన్కు చోటు దక్కే అవకాశం లేదు. సెంచూరియన్ పిచ్ పేస్కు అనుకూలంగా ఉండనున్న నేపథ్యంలో టీమిండియా నలుగురు పేసర్లతో బరిలోకి దిగనుంది. ఒకవేళ ఈ మ్యాచ్ ఆడినా.. 11 వికెట్లు తీయడం అసాధ్యం. స్పిన్కు ఏ మాత్రం అనుకూలంగా ఉండని పిచ్పై అశ్విన్ ప్రభావం ఏ మాత్రం ఉండదు.
ఒకవేళ రెండు మ్యాచ్ల్లో అశ్విన్కు ఆడే అవకాశం దక్కితే మాత్రం ఈ ఫీట్ సాధించవచ్చు. సౌతాఫ్రికా పర్యటనలో ఈ ఫీట్ మిస్సైనా.. సొంతగడ్డపై ఇంగ్లండ్తో జరిగే సిరీస్లో అశ్విన్ ఈ ఘనతను అందుకున్నాడు. స్పిన్కు అనుకూలంగా ఉండే భారత్ పిచ్లపై అశ్విన్కు తిరుగుండదు.
భారత్-సౌతాఫ్రికా మధ్య జరిగే తొలి టెస్ట్కు భారీ అడ్డంకి ఏర్పడింది. ఈ మ్యాచ్ జరిగే సెంచూరియన్లో భారీ వర్షం కురుస్తోంది. మంగళవారం కూడా వర్షం పడే అవకాశం ఉందని అక్కడి వాతావరణ శాఖ హెచ్చరించింది. ఇప్పటికే సెంచూరియన్ మైదానాన్ని పూర్తిగా కవర్లతో కప్పి ఉంచారు. ఈ క్రమంలోనే తొలి రోజు ఆట పూర్తిగా తుడిచిపెట్టుకుపోయే ప్రమాదం పొంచి ఉంది.