
రిస్క్ తీసుకోవాలి
కేన్ విలియమ్సన్ మాట్లాడుతూ... 'ఢిల్లీ క్యాపిటల్స్ చాలా మంచి జట్టు. కొన్ని రోజుల క్రితం, తక్కువ సమయంలో మేం ఎలా లయ దొరకబుచ్చుకున్నామో.. ఢిల్లీ ఆటగాళ్లు కూడా అలాగే ప్రయత్నిస్తున్నారు. మాపై ఢిల్లీ బాగా ఆడింది. మొదట బ్యాటింగ్ చేసిన ఢిల్లీ భారీ స్కోర్ చేసింది. ఛేజింగ్కు దిగినప్పుడు రిస్క్ తీసుకోవాలి. మాకు శుభారంభం దక్కలేదు. కానీ మధ్యలో భాగస్వామ్యాలు నెలకొల్పగలిగాం. దాంతో మాకు కొద్దిగా విజయావకాశాలు ఉన్నాయి. కానీ ఫైనల్ చేరలేకపోయాం' అని అన్నాడు.

సిగ్గుగా ఉంది
'ఫైనల్కు చేరలేకపోవడం చాలా సిగ్గుగా ఉంది. అయితే గత మూడు వారాలుగా మా కుర్రాళ్లు గర్వించేలా ఆడారు. అందుకు సంతోషంగా ఉంది. ఇది మాకు మంచి సీజన్ అనే చెప్పాలి. చాలా మ్యాచ్ల్లో సన్రైజర్స్ విజయానికి చేరువగా వచ్చి ఓడింది. బహుశా మేం అత్యుత్తమ ఆటతీరు కనబర్చలేకపోయాం. ఐపీఎల్లో ప్రతి జట్టు బలమైందే.. ఎవరు ఎవర్నైనా ఓడించొచ్చు. అలాంటప్పుడు బాగా ఆడాలి. టాప్-2లో ఉంటేనే ఉత్తమం. మా ఆటపై చర్చిస్తాం' అని విలియమ్సన్ తెలిపాడు.

గార్గ్ సూపర్
'ఐపీఎల్ 2020లో హైదరాబాద్ తరఫున చాలా మంది కుర్రాళ్లు రాణించారు. టీ నటరాజన్, సందీప్ శర్మ, ప్రియమ్ గార్గ్, అబ్దుల్ సమద్ బాగా రాణించారు. గార్గ్ నెట్స్లో చక్కటి షాట్లు ఆడుతున్నాడు. భవిష్యత్తులో అతడు తప్పకుండా అద్భుతమైన ఆటగాడవుతాడు' అని కేన్ విలియమ్సన్ ఆశాభావం వ్యక్తం చేశాడు. టోర్నీ ఆసాంతం అండగా నిలిచిన అభిమానులకు విలియమ్సన్ కృతజ్ఞతలు తెలిపాడు. వచ్చే ఐపీఎల్ 2021లో మంచి ప్రదర్శన చేస్తాం అని హామీ ఇచ్చాడు. క్వాలిఫైయర్ మ్యాచ్లో విలియమ్సన్ (45 బంతుల్లో 67; 5 ఫోర్లు, 4 సిక్స్లు) పోరాడినప్పటికీ సన్రైజర్స్ విజయాన్ని అందుకోలేకపోయింది.
DC vs SRH: మైదానంలోకి హల్క్ బొమ్మను స్టోయినిస్ ఎందుకు తీసుకొచ్చాడో తెలుసా?


Click it and Unblock the Notifications












