For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఆ అవకాశాన్ని చేజార్చుకోవడంపై ఇప్పటికీ బాధపడుతున్నా: పృథ్వీ షా

Prithvi Shaw says I was disappointed when I got out on 379 runs in Ranji trophy

రాంచీ: దేశవాళీ ప్రతిష్టాత్మక టోర్నీ రంజీట్రోఫీ 2023లో నయా చరిత్రను లిఖించే అవకాశాన్ని చేజేతులా చేజార్చుకున్నానని టీమిండియా యువ ఓపెనర్ పృథ్వీ షా అన్నాడు. అస్సాంతో జరిగిన మ్యాచ్‌లో ముంబై తరఫున బరిలోకి దిగిన పృథ్వీ షా(383 బంతుల్లో 49 ఫోర్లు, 4 సిక్స్‌లతో 379)విధ్వంసకర బ్యాటింగ్‌తో ట్రిపుల్ సెంచరీ సాధించాడు. అయితే క్వాడ్రాపుల్ సెంచరీ చేసే సువర్ణవకాశాన్ని తాను చేజార్చుకున్నానని, 21 పరుగుల దూరంలో ఆ ఘనతను అందుకోకపోవడం చాలా బాధకు గురి చేసిందని పృథ్వీ షా తాజాగా బీసీసీఐ టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపాడు.

ఫోన్ హ్యాంగ్ అయ్యింది..

ఈ ట్రిపుల్ సెంచరీతో 18 నెలల తర్వాత టీమిండియాకు ఎంపికైన పృథ్వీ షా.. న్యూజిలాండ్‌తో తొలి టీ20 ముందు బీసీసీఐ టీవీతో మాట్లాడాడు. ఈ వీడియోను బీసీసీఐ శుక్రవారం అభిమానులతో పంచుకుంది. టీమిండియాకు ఎంపికైన క్షణాన తనకు అభినందనలు వెల్లువెత్తాయని, వరుస ఫోన్లు, మేసేజ్‌లతో తన మొబైల్ హ్యాంగ్ అయ్యిందని పృథ్వీ షా చెప్పాడు. 'చాలా రోజులుగా నేను భారత జట్టుకు దూరంగా ఉన్నాను. మళ్లీ పునరాగమనం చేయడం సంతోషంగా ఉంది. రాత్రి 10.30 సమయంలో జట్టును ప్రకటించారు. ఆ క్షణంలో నాకు చాలా ఫోన్లు, మెసేజ్‌లు వచ్చాయి. వాటి దెబ్బకు నా ఫోన్ హ్యాంగ్ అయ్యింది. దాంతో ఏం జరుగుతుందని కాస్త షాక్‌కు గురయ్యాను.

అందరూ అండగా నిలిచారు..

అందరూ అండగా నిలిచారు..

గత 18 నెలలుగా జట్టుకు దూరంగా ఉన్న నాకు ఈ సమయం చాలా కఠినంగా గడిచింది. కానీ నాకు మద్దుతు ఇచ్చే వారు మాత్రం అండగా నిలిచారు. భారత్ జట్టుకు రాక ముందు నుంచి అండగా నిలిచినవారు ఆ మద్దతును అలానే కొనసాగించారు. నేను ఆడకపోయినా.. వారు నాకు మద్దుతుగా ఉండటం సంతోషాన్నిచ్చింది. నా స్నేహితులు, కుటుంబం, తండ్రి, కోచ్‌లు చాలా సపోర్ట్‌గా నిలిచారు. అలాంటి వారు నా జీవితంలో ఉండటం చాలా అదృష్టంగా భావిస్తున్నాను.

మా నాన్న ఒక్కటే చెప్పాడు..

మా నాన్న ఒక్కటే చెప్పాడు..

ఇక టీమ్ సెలెక్ట్ అయినందుకు నేను ఎలాంటి సంబరాలు చేసుకోలేదు. ఆ సమయంలో నేను అస్సాంలో ఉన్నాను. మా నాన్న మాత్రం చాలా సంతోషించాడు. జట్టులోకి మళ్లీ రీఎంట్రీ ఇచ్చావ్.. ఫోకస్ ఆట మీద పెట్టాలని హెచ్చరించాడు. అవకాశం వస్తే పరుగులు చేసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాలని సూచించాడు.'అని పృథ్వీ షా చెప్పుకొచ్చాడు.

 400 కొట్టాల్సింది..

400 కొట్టాల్సింది..

రంజీట్రోఫీలో ట్రిపుల్ సెంచరీ సాధించడంపై స్పందిస్తూ.. పృథ్వీ షా సంతోషం వ్యక్తం చేశాడు. 'ట్రిపుల్ సెంచరీతో రంజీల్లో రికార్డు నెలకొల్పడం సంతోషంగా ఉంది. నేను ఆటను మాత్రమే ఆడాను. ప్రత్యేకంగా ఏం చేయలేదు. నాపై పూర్తి నమ్మకంతో ఆడాను. సెంచరీ, డబుల్ సెంచరీ చేసినా కూడా పట్టుదలతో నా ఇన్నింగ్స్ కొనసాగించాను. అయితే 400 చేయకపోవడంపై ఇప్పటి కీ బాధపడుతున్నాను. మరో 21 పరుగులు చేస్తే ఆ ఘనత నాకు దక్కేది.

Story first published: Friday, January 27, 2023, 17:47 [IST]
Other articles published on Jan 27, 2023
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+