
చెత్త కెప్టెన్సీ..
అయితే మంగళవారం రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(ఆర్సీబీ) జరిగిన మ్యాచులో ఒక్క పరుగు తేడాతో ఢిల్లీ ఓటమి పాలైన విషయం తెలిసిందే. ఈ మ్యాచులో రిషభ్ పంత్ (48 బంతుల్లో 6 ఫోర్లుతో 58 నాటౌట్), హెట్మైర్ ( 25 బంతుల్లో 2 ఫోర్లు, 4 సిక్స్లతో 53 నాటౌట్) పోరాడిన ఫలితం లేకపోయింది. అయితే ఈ మ్యాచ్లో ఢిల్లీ పరాజయానికి రిషభ్ పంత్ కెప్టెన్సీనే కారణమని భారత మాజీ క్రికెటర్లు వీరేంద్ర సెహ్వాగ్, ఆకాశ్ చోప్రా ఆగ్రహం వ్యక్తం చేశారు. అమిత్ మిశ్రాతో పూర్తి కోటా బౌలింగ్ చేయించకుండా ఘోర తప్పిదం చేశాడని విమర్శించారు. ఈ క్రమంలోనే పంత్ను ఓజా వెనుకేసుకొచ్చాడు.

భవిష్యత్ కెప్టెన్..
ఇండియా టుడేతో మాట్లాడుతూ.. పంత్కు అండగా నిలిచాడు. 'జట్టును నడిపించే విధానం, బ్యాటింగ్లో ఇదే విధమైన పరిపక్వతను కొనసాగిస్తే పంత్ భవిష్యత్లో భారత జట్టు కెప్టెన్ అవుతాడనే నమ్మకం నాకుంది. రిషభ్ గురించి తెలుసుకుని.. ప్రజలతో మాట్లాడిన తర్వాత అతడు టీమిండియాకు కెప్టెన్గా ఉండాల్సిన వ్యక్తిగా భావిస్తున్నా.
సౌరవ్ గంగూలీ.. ధోనీలోని నాయకత్వ లక్షణాలను ఇలానే వెలుగు చూశాయి. పంత్ విషయంలో ఏం జరుగుతుందో చూడాలి. దానికింకా చాలా సమయం ఉంది. కానీ ప్రస్తుతం పంత్..తనను తాను ఆటగాడిగా, నాయకుడిగా అభివృద్ధి చేసుకుంటున్న విషయాన్ని నిశితంగా గమనించాలి. రవిశాస్త్రి భాయ్ (టీమిండియా ప్రధాన కోచ్) శిక్షణలో పంత్ రాటుదేలుతాడని భావిస్తున్నా'' అని ఓజా పేర్కొన్నాడు.

ఉత్కంఠ విజయం..
ముందుగా బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లకు 171 రన్స్ చేసింది. ఏబీ డివిలియర్స్(42 బంతుల్లో 3 ఫోర్లు, 5 సిక్స్లతో 75 నాటౌట్) పరుగుల విధ్వంసానికి అండగా యువ ప్లేయర్ పటిదార్(22 బంతుల్లో 2 సిక్స్లతో 31), గ్లేన్ మ్యాక్స్వెల్(20 బంతుల్లో 1 ఫోర్, 2 సిక్స్లతో 25) సత్తా చాటారు. ఢిల్లీ బౌలర్లలో ఇషాంత్ శర్మ, అవేశ్ ఖాన్, రబడా, అమిత్ మిశ్రా, అక్షర్ పటేల్ తలో వికెట్ తీశారు.
అనంతరం ఢిల్లీ క్యాపిటల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 170 రన్స్ చేసింది. కెప్టెన్ రిషభ్ పంత్(48 బంతుల్లో 6 ఫోర్లతో 58 నాటౌట్), షిమ్రన్ హెట్మైర్(25 బంతుల్లో 2 ఫోర్లు, 4 సిక్స్లతో 53 నాటౌట్) అజేయ హాఫ్ సెంచరీలతో పోరాడిన ఫలితం లేకపోయింది. ఆర్సీబీ బౌలర్లలో హర్షల్ పటేల్ 2 వికెట్లు తీయగా.. సిరాజ్, జెమీసన్ తలో వికెట్ దక్కించుకున్నారు.


Click it and Unblock the Notifications












