లండన్: క్రికెట్లో జాతి వివక్షపై మరో మాజీ క్రికెటర్ గళమెత్తాడు. అప్పట్లో ఇంగ్లండ్ తరఫున ఆడినందుకు తనకు బెదిరింపులు వచ్చేవని ఆ దేశ మాజీ ఆల్రౌండర్ ఫిలిప్ డిఫ్రిటస్ తెలిపాడు. దీంతో తాను క్రికెట్పై ఎక్కువగా దృష్టి పెట్టలేకపోయానని ఆవేదన వ్యక్తం చేశాడు. వెస్టిండీస్ మూలాలున్న ఫిలిప్.. ఇంగ్లండ్ తరఫున 103 వన్డేలు, 44 టెస్టులు ఆడాడు.
'నేషనల్ ఫ్రంట్ నుంచి చాలాసార్లు నాకు బెదిరింపు లేఖలు వచ్చేవి. నీవు ఇంగ్లండ్కు ఆడితే షూట్ చేస్తామంటూ ఆ లేఖలో హెచ్చరించేవారు. లార్డ్స్లో టెస్టుకు రెండురోజుల ముందు ఓసారి ఇలాగే బెదిరించారు. దీంతో మ్యాచ్ ఆడాలా వద్దా? అని ఆలోచించా. ఒకవేళ ఆడితే నాపై స్నైపర్ దాడి జరుగుతుందా అని ఆందోళన చెందా. నిజానికి అప్పట్లో నాకెవరూ మద్దతుగా నిలవలేదు. ఎలాంటి సహాయం చేయలేదు. అది నన్ను చాలా బాధించేది.
కానీ ఆటపై ఉన్న అంకితభావంతోనే ముందుకు సాగా. నేను సాధించినదానిపట్ల గర్వంగా ఫీలవుతున్నా. తెల్ల క్రికెటర్ల కంటే రెండు రెట్లు మంచివాడినని అనుకునేవాడిని. జట్టుతో ఉన్నా ఒంటరిగా ఫీలయ్యేవాడిని. ప్రతీ మ్యాచ్ నాకు చివరిదేనని భావించేవాడిని. ఈ వివక్షపై గళమెత్తాలనుకున్నా.. జట్టులో చోటు పోతుందో ఏమోనని భయపడేవాడిని. కానీ ఇప్పుడు పరిస్థితులు మారాయి. ప్రపంచం మొత్తం జాతి వివక్షపై పోరాడుతుంది. ఇంగ్లండ్ జట్టు కూడా వివక్షకు తావులేదని స్పష్టం చేసింది. ప్రస్తుత ఆటగాళ్లు ఇది ఒక మంచి అవకాశం'అని 54 ఏళ్ల డిఫ్రిటస్ చెప్పాడు.
పాక్ క్రికెట్ బోర్డును ఆడుకుంటున్న కరోనా.. పదిలో ఆరుగురికి నెగటీవ్