చెన్నై: టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ, సౌతిండియన్ హీరోయిన తమన్నా భాటియాను అరెస్ట్ చేయాలంటూ ఓ న్యాయవాది మద్రాస్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఆన్లైన్ మోసాలకు పాల్పడుతున్నయాప్స్ను కూడా నిషేధించాలని పేర్కొన్నారు. ఆన్లైన్ అవకతవకలకు పాల్పడే కొన్ని కంపెనీలు, యాప్స్.. విరాట్ కోహ్లీ, తమన్నాలను తమ ఉత్పత్తులకు ప్రచారకర్తలుగా వాడుకుంటూ యువతను నమ్మిస్తున్నాయని ప్రస్తావించారు.
ఇది నమ్మిన చాలా మంది మోసపోయారని, ఈ విషయంలో బాధ్యతారహితంగా వ్యవహరిస్తున్న విరాట్ కోహ్లీ, తమన్నాలను అరెస్ట్ చేయాలని పిటిషన్లోపేర్కొన్నారు. ఇటీవలే ఓ యువకుడు ఈ ఫేక్ యాప్స్లో డబ్బులు పోగొట్టుకొని ఆత్మహత్య చేసుకున్నాడని, ఆకేసుకు సంబంధించిన వివరాలను ఈ పిటిషన్కు జత చేశాడు. ఇక ఈ పిటిషన్పై ధర్మాసనం మంగళవారం విచారణ చేపట్టనున్నట్లు తెలుస్తోంది.
ఇక కరోనా కారణంగా గత నాలుగు నెలలుగా ఇంటికే పరిమితమైన విరాట్ కోహ్లీ.. ఐపీఎల్ 20 సీజన్ కోసం సమాయత్తం అవుతున్నాడు. కరోనా కట్టడికి తన వంతు సాయం చేసిన కోహ్లీ.. తాజాగా అసోం, బీహార్ వరద బాధితులకు అండగా నిలిచాడు. సతీమణి అనుష్క శర్మతో కలిసి సహాయక చర్యలు చేపడుతున్నవారికి ఆర్థిక తోడ్పాటును అందిస్తున్నాడు. తోచిన సహాయం చేయాలని అభిమానులకు కూడా పిలుపునిచ్చాడు.