ఐపీఎల్ 2024 సీజన్లో కొత్త సంప్రదాయానికి శ్రీకారం చుట్టారు. టాస్ ఫలితాన్ని టీవీ కెమెరాలకు చూపించడం మొదలుపెట్టారు. ముంబై ఇండియన్స్ వర్సెస్ ఆర్సీబీ మ్యాచ్లో టాస్ ఫలితాన్ని తారుమారు చేశారనే ఆరోపణల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
ఆ మ్యాచ్లో హార్దిక్ పాండ్యా కాయిన్ను ఫ్లిప్ చేయగా.. అది దూరం పడింది. మ్యాచ్ రిఫరీ జవగళ్ శ్రీనాథ్ కాయిన్ తీసే సమయంలో ఫ్లిప్ చేసి ముంబైకి అనుకూలంగా వ్యవహరించారనే ఆరోపణలు వచ్చాయి. ఈ వ్యవహారంపై సోషల్ మీడియా వేదికగా దుమారం రేగింది. ఆ మ్యాచ్ ఫలితంలో టాస్ కీలక పాత్ర పోషించడంతో మరిన్ని విమర్శలు వచ్చాయి. ఆర్సీబీ కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్ సైతం ఈ వ్యవహారంపై అసంతృప్తి వ్యక్తం చేశాడు.

సన్రైజర్స్ హైదరాబాద్తో మ్యాచ్ సందర్భంగా ఆ జట్టు కెప్టెన్ ప్యాట్ కమిన్స్కు హార్దిక్ పాండ్యా చేసిన మోసాన్ని వివరించాడు. ఇందుకు సంబంధించిన వీడియో కూడా నెట్టింట వైరల్గా మారింది.
ఈ విమర్శల నేపథ్యంలోనే టాస్ ఫలితాన్ని కెమెరాలకు చూపించాలని ఐపీఎల్ అధికారులు నిర్ణయించారు. పంజాబ్ కింగ్స్ వర్సెస్ ముంబై ఇండియన్స్ మధ్య జరుగుతున్న తాజా మ్యాచ్తోనే ఈ నిర్ణయాన్ని అమలు చేశారు. సామ్ కరణ్ కాయిన్ ఫ్లిప్ చేయగా.. టాస్ ఫలితాన్ని కెమెరాల్లో చూపించారు.
ఈ మ్యాచ్లో పంజాబ్ కింగ్స్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. ఈ సీజన్లో కొనసాగుతున్నఛేజింగ్ ట్రెండ్ నేపథ్యంలోనే ఈ నిర్ణయం తీసుకున్నానని పంజాబ్ కింగ్స్ తాత్కలిక సారథి సామ్ కరణ్ తెలిపాడు. రెగ్యులర్ కెప్టెన్ శిఖర్ ధావన్ ఈ మ్యాచ్కు కూడా దూరమవడంతో వైస్ కెప్టెన్ అయిన సామ్ కరణ్ జట్టును నడిపిస్తున్నాడు.
ముంబై ఇండియన్స్: రోహిత్ శర్మ, ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా(కెప్టెన్), టీమ్ డేవిడ్, రొమారియో షెఫర్డ్, మహమ్మద్ నబీ, గెరాల్డ్ కోయిట్జీ, శ్రేయస్ గోపాల్, జస్ప్రీత్ బుమ్రా
పంజాబ్ కింగ్స్: రిలీ రోసౌ, ప్రభ్సిమ్రాన్ సింగ్, సామ్ కరణ్, జితేశ్ శర్మ, లియామ్ లివింగ్స్టోన్, శశాంక్ సింగ్, అషుతోష్ శర్మ, హర్ప్రీత్ బ్రార్, హర్షల్ పటేల్, కగిసో రబడా, అర్ష్దీప్ సింగ్