
వేలంలో దూకుడు..
కేఎల్ రాహుల్, షారూఖ్, రవి బిష్ణోయ్ వంటి తమ మాజీ ఆటగాళ్లు వేలంలోకి వెళ్తామని పట్టుబట్టడంతో పంజాబ్ కింగ్స్ మయాంక్ అగర్వాల్(రూ.14 కోట్లు), అర్ష్దీప్ సింగ్(రూ.4 కోట్లు)లను మాత్రమే రిటైన్ చేసుకుంది. దాంతో పంజాబ్ వేలంలో రూ.72 కోట్లతో రిచెస్ట్ ఫ్రాంచైజీగా పాల్గొంది. గతంలో కూడా భారీ డబ్బుతో వేలంలో పాల్గొన్న పంజాబ్ సరైన ఆటగాళ్లను కొనుగోలు చేయలేకపోయింది. కానీ ఈ సారి మాత్రం మంచి టీమ్ను సెలెక్ట్ చేసుకుంది. ముఖ్యంగా ఆ జట్టు మొదటి తుది జట్టు అద్భుతంగా ఉంది. కానీ బ్యాకప్ ఆప్షనే బాలేదు. లియాన్ లివింగ్ స్టోన్(రూ.11.5 కోట్లు), షారూఖ్ ఖాన్(రూ.9 కోట్లు), శిఖర్ ధావన్(రూ.8.25 కోట్లు), జానీ బెయిర్ స్టో(రూ. 6.75 కోట్లు), రాహుల్ చాహర్ (రూ.5.25 కోట్లు), కగిసో రబడా(రూ.9.25 కోట్లు)ల కోసం పంజాబ్ బాగా ఖర్చు పెట్టింది.

స్మార్ట్ పిక్స్ ఇవే..
ఈ ఆరుగురి ఆటగాళ్ల కోసమే రూ.50 కోట్లు ఖర్చు పెట్టగా.. మిగతా రూ. 12 కోట్లతోనే ఇతర ఆటగాళ్ల స్థానాలను నింపేసింది. దాంతో అనామక ఆటగాళ్లను తీసుకురావాల్సి రావడంతో బ్యాకప్ బలహీనంగా కనిపిస్తోంది. అయితే బిగ్ హిట్టింగ్ సామర్థ్యంతో పాటు ఆఫ్ , లెగ్ స్పిన్ వేయగల లియామ్ లివింగ్స్టోన్ తీసుకొని మంచి పని చేసింది. అంతేకాకుండా స్టార్ ప్లేయర్ శిఖర్ ధావన్, బెయిర్ స్టోలను తక్కువ ధరకే కొనుగోలు చేసింది. సౌతాఫ్రికా పేస్ దిగ్గజం కగిసో రబడాను దక్కించుకుంది. స్పెషలిస్ట్ స్పిన్నర్ రాహుల్ చాహర్ను కూడా తీసుకోవడం పంజాబ్కు ప్లస్ పాయింట్. 8 మంది ఓవర్ సీస్ ప్లేయర్స్ తీసుకోవడానికి అవకాశం ఉన్నప్పటికీ పంజాబ్ ఏడుగురిని మాత్రమే తీసుకుంది. ఎక్కువ అనామక ఆటగాళ్లను తీసుకోవడంతో బ్యాకప్ బలహీనంగా కనిపిస్తోంది. అంతేకాకుండా ఓ మంచి ఇండియన్ బ్యాట్స్మన్ , ఫారిన్ బౌలర్ మిస్సైనట్లు అనిపిస్తోంది. క్వాలిటీ, ఎక్సైటింగ్ ఆల్రౌండర్ కూడా లేకపోవడం ఆ జట్టు బలహీనతగా చెప్పుకోవచ్చు.

ఓపెనర్లుగా శిఖర్, మయాంక్..
ఇక ఓపెనర్లుగా శిఖర్ ధావన్, మయాంక్ అగర్వాల్ బరిలోకి దిగనున్నారు. ఇద్దరూ అనుభవం కలిగిన ఆటగాళ్లే కావడం పంజాబ్కు ప్లస్ పాయింట్. జానీ బెయిర్ స్టో నెంబర్ 3లో బ్యాటింగ్ చేసే చాన్సుంది. ఆ తర్వాత ఫించ్ హిట్టర్ లియామ్ లింగ్ స్టోన్, షారూఖ్ ఖాన్ బరిలోకి దిగనున్నారు. ఆరో స్థానంలో వెస్టిండీస్ ఆల్రౌండర్ ఓడీన్ స్మిత్, ఏడో స్థానంలో రిషి ధావన్ బ్యాటింగ్ చేయనున్నారు. ఏనిమిదో స్థానంలో హర్ప్రీత్ బ్రార్ బరిలోకి దిగనున్నాడు. స్పెషలిస్ట్ పేసర్లుగా కగిసో రబడాతో పాటు అర్ష్ దీప్ సింగ్ ఆడనున్నారు. రబడా వరకు బ్యాటింగ్ డెప్త్ ఉంది. స్పెషలిస్ట్ స్పిన్నర్గా రాహుల్ చాహర్ బరిలోకి దిగనున్నాడు. ఇక కెప్టెన్గా శిఖర్ ధావన్ను నియమిస్తారని అంతా భావించినా.. మయాంక్ అగర్వాల్ పేరు ప్రధానంగా వినిపిస్తోంది.

పంజాబ్ తుది జట్టు అంచనా..
శిఖర్ ధావన్, మయాంక్ అగర్వాల్, జానీ బెయిర్ స్టో, లియామ్ లివింగ్ స్టోన్, షారూఖ్ ఖాన్, ఓడీన్ స్మిత్, రిషి ధావన్, హర్ప్రీత్ బ్రార్, కగిసో రబడా, రాహుల్ చాహర్, అర్ష్దీప్ సింగ్,

పంజాబ్ పూర్తి జట్టు ఇదే..
మయాంక్ అగర్వాల్(రూ.14 కోట్లు), అర్ష్దీప్ సింగ్(రూ.4 కోట్లు), లియామ్ లివింగ్ స్టోన్(రూ.11.50 కోట్లు), కగిసో రబడా(రూ.9.25 కోట్లు), షారూఖ్ ఖాన్(రూ.9 కోట్లు), శిఖర్ ధావన్(రూ.8.25 కోట్లు), జానీ బెయిర్ స్టో(రూ.6.75 కోట్లు), ఓడిన్ స్మిత్(రూ.6 కోట్లు), రాహుల్ చాహర్(రూ.5.25 కోట్లు), హర్ప్రీత్ బ్రార్(రూ.3.80 కోట్లు), రాజ్ అంగడ్ బావ(రూ.2 కోట్లు), వైభవ్ అరోరా(రూ.2 కోట్లు), నాథన్ ఎల్లిస్(రూ.75 లక్షలు), ప్రభ్ సిమ్రన్ సింగ్(రూ.60 లక్షలు), రిషీ ధావన్(రూ.55 లక్షలు), సందీప్ వర్మ(రూ.50 లక్షలు), భానుక రాజపక్స(రూ.50 లక్షలు), బెన్ని హోవల్(రూ.40 లక్షలు), ఇషాన్ పోరెల్(రూ.25 లక్షలు), జితేశ్ శర్మ(రూ.20 లక్షలు), ప్రేరక్ మన్కండ్(రూ.20 లక్షలు), అథర్వ టైడ్(రూ.20 లక్షలు), వ్రిట్టిక్ చటర్జీ(రూ.20 లక్షలు), బాల్తేజ్ ధండా(రూ.20 లక్షలు), అన్ష్ పటేల్(రూ.20 లక్షలు)


Click it and Unblock the Notifications












