For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

టీ20 ప్రపంచకప్ ముందే రోహిత్ శర్మను కెప్టెన్ చేయాలి: పార్థీవ్ పటేల్

Parthiv Patel says Rohit Sharma should be made India captain ahead of upcoming T20 World Cup

న్యూఢిల్లీ: టీ20 ప్రపంచకప్ ముందే స్టార్ ఓపెనర్‌ రోహిత్‌ శర్మకు టీమిండియా టీ20 ఫార్మాట్ కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించాలని మాజీ వికెట్ కీపర్ పార్థీవ్ పటేల్ తెలిపాడు. అలా చేస్తే ప్రస్తుత కెప్టెన్ విరాట్‌ కోహ్లీపై భారం తగ్గుతుందని అభిప్రాయపడ్డాడు. ఇక బుధవారమే పార్థీవ్ అంతర్జాతీయ క్రికెట్‌తో సహా అన్ని ఫార్మాట్ల ఆటకు వీడ్కోలు పలికిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అతను ఓ స్పోర్ట్స్ చానెల్‌తో మాట్లాడుతూ రోహిత్‌ శర్మ, విరాట్ కోహ్లీ కెప్టెన్సీ వ్యవహారంపై స్పందించాడు. హిట్‌మ్యాన్‌ పూర్తి ఫిట్‌నెస్‌తో ఉండి మ్యాచ్‌లు ఆడితే వెంటనే అతన్ని కెప్టెన్ చేయాలన్నాడు. అందుకు ఇదే సరైన సమయమని పేర్కొన్నాడు.

రోహిత్ కెప్టెన్సీ సూపర్..

రోహిత్ కెప్టెన్సీ సూపర్..

‘జట్టును ఎలా నిర్మించాలో రోహిత్ శర్మకు బాగా తెలుసు. టోర్నీలు ఎలా గెలవాలో కూడా చూపించాడు. ఇప్పుడున్న పరిస్థితుల్లో టీమిండియా టీ20 ఫార్మాట్‌ బాధ్యతలను అతనికి అప్పగిస్తే ఎలాంటి ప్రమాదం ఉండదు. అలా చేస్తే విరాట్‌ కోహ్లీపై ఉన్న భారం కూడా తగ్గుతుంది. రోహిత్‌తో కలిసి చాలా టోర్నీలు గెలిచాం. ఒత్తిడిలో అతను తీసుకునే నిర్ణయాలు బాగుంటాయి. ఇక ముంబై ఇండియన్స్‌కు ఎప్పుడూ సమతూకమైన జట్టు ఉండదు. కానీ ఆటగాళ్లందరినీ ఒక్కతాటిపైకి తెచ్చి ఫలితాలు ఎలా సాధించాలో రోహిత్‌ చూపించాడు. భారత జట్టు కెప్టెన్సీ విషయంలో ఇద్దరికీ అవకాశం ఉంది. ఐపీఎల్‌‌తో ఇది స్పష్టమైంది. ఈ టీ20 టోర్నీ వల్ల ఎవరి ప్రతిభ ఏమిటో తెలిసింది.'అని పార్థీవ్ చెప్పుకొచ్చాడు.

రాణించినా ఎంపిక చేయలేదు..

రాణించినా ఎంపిక చేయలేదు..

ఇక 2009 రంజీల్లో 800 రన్స్, దులీప్ ట్రోఫీ ఫైనల్లో సెంచరీ కొట్టినా తనకు భారత జట్టులో చోటు దక్కలేదని పార్థీవ్ ఆవేదన వ్యక్తం చేశాడు. అప్పుడు చాలా బాధపడినట్లు చెప్పిన పార్దీవ్.. కొత్త టీమ్‌ను బిల్డ్ చేస్తున్నారని సరిపెట్టుకున్నానన్నాడు. ఇక బ్యాటింగ్ స్కిల్స్ ఆధారంగానే టీమిండియా వికెట్ కీపర్ ఎంపిక జరగాలని, తన వరకైతే టెస్ట్‌ల్లో సాహా బెస్ట్ అన్నాడు. ఫార్మాట్ మారే కొద్ది స్కిల్స్ కూడా మారుతాయన్నాడు. కీపింగ్, బ్యాటింగ్ సమాన స్థాయిలో ఉన్న ఆటగాళ్లకు భారత్‌కు ఆడాలని, కుర్రాళ్లు సీనయర్ ప్లేయర్లతో ఎక్కువ టైమ్ స్పెండ్ చేయాలన్నాడు.

ఆ ఇద్దరే తీర్చిదిద్దారు..

ఆ ఇద్దరే తీర్చిదిద్దారు..

తన 18 ఏళ్ల కెరీర్‌లో అండగా నిలిచిన ప్రతీ ఒక్కరికి ధన్యవాదాలు తెలిపిన పార్దీవ్.. గంగూలీ, కుంబ్లేలకు స్పెషల్ థ్యాంక్స్ చెప్పాడు. ‘నిజమైన నాయకుడంటే సౌరవ్ గంగూలీ. అతని మేనేజ్‌మెంట్ స్కిల్ అద్భుతం. కుంబ్లే కూడా గ్రేట్ లీడర్. ఈ ఇద్దరే నన్ను తీర్చి దిద్దారు. నా ఫస్ట్ టెస్ట్ క్యాప్‌పై పేరు తప్పుగా పడింది. అది ఇంకా నా మదిలో అలాగే నిలిచిపోయింది. ఆ క్యాప్‌నే దాదా చేతుల మీదుగా అందుకున్నా. హెడింగ్లీ(2002), అడిలైడ్ (2003-04)లో విక్టరీలు, రావల్పిండిలో ఓపెనర్‌గా హాఫ్ సెంచరీ నా ఫెవరేట్ మెమొరీస్.'అని పార్ధీవ్ తెలిపాడు.

భిన్నాభిప్రాయాలు..

భిన్నాభిప్రాయాలు..

ఈ సీజన్ ఐపీఎల్ 2020 టైటిల్‌ను ముంబై ఇండియన్స్ గెలవడంతో టీ20 ఫార్మాట్ సారథ్య బాధ్యతలను రోహిత్‌కు ఇవ్వాలనే డిమాండ్ బలంగా వినిపిస్తోంది. గౌతం గంభీర్, మైఖేల్ వాన్, పార్ధీవ్ వంటి క్రికెటర్లు రోహిత్‌ను కెప్టెన్సీ చేయడం భారత జట్టుకు మంచిదంటున్నారు. అయితే వీరేంద్ర సెహ్వాగ్, హర్భజన్ సింగ్, కపిల్ దేవ్‌, ఆకాష్ చోప్రాలు మాత్రం ఆ అవసరం ఏం లేదని, దాని వల్ల అనవసర సమస్యలు వస్తాయని విరాట్‌కు మద్దతుగా నిలిచారు.

ముంబై ఇండియన్స్ బలంగా ఉండటం వల్లనే విజయం సాధించిందని, అంతేకాని రోహిత్ ఒక్కడి వల్ల సాధ్యం కాలేదని స్పష్టం చేశారు. ఇక ఆస్ట్రేలియా పర్యటనలో భారత్ తొలి రెండు వన్డేల్లో ఓడగానే మళ్లీ ఈ డిమాండ్ తెరపైకి వచ్చింది. కానీ ఆ తర్వాత టీ20 సిరీస్ నెగ్గడంతో విరాట్ విమర్శకులు మళ్లీ వెనక్కి తగ్గారు.

Story first published: Friday, December 11, 2020, 10:50 [IST]
Other articles published on Dec 11, 2020
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+