హసన్ అలీపై సందేహాలు..
అచ్చం న్యూజిలాండ్-ఇంగ్లండ్ సెమీస్ను తలపిస్తూ సాగిన పోరులో కివీస్ మాదిరిగానే ఆసీస్ మయా చేసింది. మాథ్యూ వేడ్(17 బంతుల్లో 2 ఫోర్లు, 4 సిక్సర్లతో 41 నాటౌట్), మార్కస్ స్టోయినీస్(31 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్సర్లతో 40 నాటౌట్) వీరిచిత బ్యాటింగ్తో అద్భుత విజయాన్నందుకొని ఫైనల్కు దూసుకెళ్లింది. అయితే ఈ మ్యాచ్లో హసన్ అలీ బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్లో దారుణంగా విఫలమయ్యాడు. ముఖ్యంగా అతను వేసిన 18వ ఓవర్లో మాథ్యూ వేడ్ ఓ భారీ సిక్సర్తో పాటు బౌండరీ బాదడంతో మ్యాచ్ మూమెంటమ్ మారింది. మ్యాచ్పై మరింత పట్టి బిగించిన ఆసీస్ సునాయస విజయాన్నందుకుంది.
మూడు విభాగాల్లో విఫలం..
అయితే ఈ మూడు విభాగాల్లో విఫలమైన హసన్ అలీపై అభిమానులు సందేహం వ్యక్తం చేస్తున్నారు. బ్యాటింగ్లో ఫస్ట్ బాల్కే క్యాచ్ ఔటై గోల్డెన్ డక్గా వెనుదిరిగిన అతను.. బౌలింగ్లో ఏ మాత్రం ప్రభావం చూపలేకపోయాడు. ఇక టోర్నీ ఆసాంతం అదరగొట్టిన అతను ఇలా కీలక మ్యాచ్లో కావాలనే విఫలమయ్యాడని పాక్ ఫ్యాన్స్ ఆరోపిస్తున్నారు. పైగా అతని సతీమణి భారత్కు చెందిన వ్యక్తని, ఫిక్సింగ్లో ఆమె పాత్ర కూడా ఉండవచ్చంటున్నారు. ప్రస్తుతం ఈ ఆరోపణలు పాక్ క్రికెట్లో దుమారం రేపుతున్నాయి. పాక్ బాబర్ ఆజామ్.. హసన్ అలీకి అండగా నిలిచినా.. అభిమానులు మాత్రం అతన్ని విలన్లా చూస్తున్నారు.

అతని భార్యే కారణమంటూ..
ఈ ఓటమిని సహించన పాక్ అభిమానులు.. హసన్ అలీ కుటుంబ సభ్యులను కూడా విడిచిపెట్టడం లేదు. ముఖ్యంగా అతని సతీమణి సమియా అర్జూ భారత్ కావడంతో పాక్ అభిమానులు ఆమెను టార్గెట్ చేస్తూ ట్రోలింగ్కు దిగుతున్నారు. జుగుప్సాకరమైన కామెంట్స్ చేస్తున్నారు. ఈ ట్రోలింగ్ను కొంతమంది భారత అభిమానులు తిప్పికొడుతున్నారు. హసన్ అలీ చేసిన తప్పిదానికి అతని ఫ్యామిలీని ట్రోల్ చేయడం ఏ మాత్రం సమంజసం కాదని కామెంట్ చేస్తున్నారు. ఇక హర్యానుకు చెందిన సమియా అర్జును హసన్ అలీ 2019లో దుబాయ్లో పెళ్లిచేసుకున్నాడు.

ఆసీస్లో నయా ఫినిషర్..
ఈ మ్యాచ్లో టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లకు 176 పరుగులు చేసింది. మహమ్మద్ రిజ్వాన్(52 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్స్లతో 67), ఫకార్ జమాన్(29 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్స్లతో 55 నాటౌట్) హాఫ్ సెంచరీలతో చెలరేగారు. కెప్టెన్ బాబర్ ఆజామ్(34 బంతుల్లో 5 ఫోర్లతో 39) పర్వాలేదనిపించాడు. ఆస్ట్రేలియా బౌలర్లలో మిచెల్ స్టార్క్ రెండు వికెట్లు తీయగా.. ప్యాట్ కమిన్స్, ఆడమ్ జంపా తలో వికెట్ దక్కించుకున్నారు.
అనంతరం 177 పరుగుల లక్ష్యచేధనకు దిగిన ఆస్ట్రేలియా 19 ఓవర్లలోనే 5 వికెట్లకు 177 పరుగులు చేసి 6 బంతులుండగానే విజయాన్నందుకుంది. మాథ్యూ వేడ్, మార్కస్ స్టోయినిస్లకు అండగా డేవిడ్ వార్నర్(30 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్స్లతో 49), మిచెల్ మార్ష్(22 బంతుల్లో 3 ఫోర్లు, సిక్స్తో 28) రాణించారు. పాక్ బౌలర్లలో షాదాబ్ ఖాన్ నాలుగు వికెట్లు తీయగా.. షాహిన్ షా ఓ వికెట్ దక్కించుకున్నాడు.


Click it and Unblock the Notifications












