For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

మెరుపు రనౌట్‌.. జాంటీ రోడ్స్‌ని గుర్తుచేసిన పాకిస్థాన్ వికెట్ కీపర్!! (వీడియో)

PAK vs SA: Mohammad Rizwan comes up with Jonty Rhodes esque run-out to remove Van der Dussen

హైదరాబాద్: క్రికెట్ ప్ర‌పంచంలో ఫీల్డింగ్‌కు వన్నె తెచ్చిన క్రికెటర్ దక్షిణాఫ్రికా మాజీ ప్లేయ‌ర్ జాంటీ రోడ్స్. అప్పట్లో జాంటీ మైదానంలో ఉంటే.. బంతి అతన్ని దాటి వెళ్లేది కాదు. గాల్లోకి దూకుతూ అద్భుత క్యాచ్‌లు పట్టేవాడు. ఇక వికెట్లపైకి పక్షిలా ఎగురుతూ రనౌట్ చేసేవాడు. తాజాగా పాకిస్థాన్ వికెట్ కీపర్ మహ్మద్ రిజ్వాన్ మెరుపు రనౌట్‌తో దిగ్గజ ఫీల్డర్ జాంటీ రోడ్స్‌ని గుర్తుకు తెచ్చాడు. కరాచీ వేదికగా పాకిస్థాన్, దక్షిణాఫ్రికా జట్ల మధ్య జరుగుతున్న తొలి టెస్టు మ్యాచ్‌లో రిజ్వాన్ మెరుపు రనౌట్ చేశాడు. దీంతో సఫారీ బ్యాట్స్‌మెన్ వాండర్ దుస్సేన్ పెవిలియన్ చేరాడు.

సింగిల్ కోసం పరుగెత్తాడు:

కరాచీ వేదికగా పాకిస్థాన్, దక్షిణాఫ్రికా మధ్య మంగళవారం తొలి టెస్టు మ్యాచ్ ప్రారంభం అయింది. దక్షిణాఫ్రికా ముందుగా బ్యాటింగ్ చేసింది. క్రీజులో వాండర్ దుస్సేన్, డీన్ ఎల్గర్ ఉన్నారు. పాకిస్తాన్ ఫాస్ట్ బౌలర్ పాహీమ్ అష్రఫ్ బౌలింగ్‌లో బంతిని కవర్స్ దిశగా హిట్ చేసిన దుస్సేన్.. సింగిల్ కోసం పరుగెత్తాడు. కానీ నాన్‌స్ట్రైక్ ఎండ్‌లో ఉన్న ఎల్గర్.. పరుగు తీసేందుకు నిరాకరించాడు. అయితే అప్పటికే దుస్సేన్ పిచ్ మధ్యలోకి వెళ్లిపోయాడు. వెనుదిరిగే క్రమంలో దుస్సేన్ చేతిలో ఉన్న బ్యాట్ చేజారింది. దీంతో మరింత ఆలస్యం అయింది.

 డైవ్ చేస్తూ వికెట్లని గీరాటేశాడు:

డైవ్ చేస్తూ వికెట్లని గీరాటేశాడు:

అప్పటికే బంతి కవర్స్ దిశగా నేరుగా ఫీల్డర్ బాబర్ అజామ్ చేతికి వెళ్లింది. వేగంగా బంతిని అందుకున్న అజామ్.. కీపర్ మహ్మద్ రిజ్వాన్‌కి త్రో చేశాడు. అప్పటికే వికెట్ల సమీపానికి వచ్చిన రిజ్వాన్.. బంతిని అందుకుని డైవ్ చేస్తూ వికెట్లని గీరాటేశాడు. రనౌట్ నుంచి తప్పించుకునేందుకు దుస్సేన్ డైవ్ చేసినా లాభం లేకపోయింది. రనౌట్ సమయానికి దుస్సేన్ క్రీజుకి చాలా దూరంలో ఉండటంతో.. ఫీల్డ్ అంపైర్ ఔట్ ఇచ్చాడు. ఇంకేముంది దుస్సేన్ నిరాశగా పెవిలియన్ చేరాడు. రిజ్వాన్ చేసిన రనౌట్‌కు సంబందించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అయింది. 'మహ్మద్ రిజ్వాన్‌.. జాంటీ రోడ్స్‌ని గుర్తుచేషావ్' అంటూ నెటిజన్లు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.

220 పరుగులకే ఆలౌట్:

220 పరుగులకే ఆలౌట్:

టెస్టులో టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసిన దక్షిణాఫ్రికా తొలి ఇన్నింగ్స్‌లో 220 పరుగులకే ఆలౌటైంది. ఓపెనర్ డీన్ ఎల్గర్ (58) మాత్రమే హాఫ్ సెంచరీ చేశాడు. మార్కరం (13), వాండర్ దుస్సేన్ (17), డుప్లెసిస్ (23), డికాక్ (15), బావుమా (17) నిరాశపరిచారు. పాక్ స్పిన్నర్ షా మూడు వికెట్లు పడగొట్టాడు. అనంతరం పాక్ తొలి ఇన్నింగ్స్‌లో భారీ స్కోర్ దిశగా సాగుతోంది. 7 వికెట్ల నష్టానికి 294 పరుగులు చేసింది. అలీ (51) హాఫ్ సెంచరీ చేయగా.. ఆలం (109) సెంచరీ బాదాడు. అష్రాఫ్ (64), అలీ (6) క్రీజులో ఉన్నారు.

World Tour Finals: ప్చ్‌.. తొలి రౌండ్‌లోనే ఓడిన సింధు, శ్రీకాంత్!!

Story first published: Wednesday, January 27, 2021, 18:01 [IST]
Other articles published on Jan 27, 2021
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+