టీ20 ప్రపంచకప్ 2024లో పాకిస్థాన్ ఎట్టకేలకు విజయం సాధించింది. వరుసగా రెండు పరాజయాల అనంతరం తప్పక గెలవాల్సిన మ్యాచ్లో సమష్టిగా రాణించి ఆశించిన ఫలితాన్ని అందుకుంది. కెనడాతో మంగళవారం జరిగిన మ్యాచ్లో పాకిస్థాన్ 7 వికెట్ల తేడాతో గెలుపొందింది.
ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన కెనడా నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లకు 106 పరుగులు చేసింది. కెనడా ఓపెనర్ ఆరోన్ జాన్సన్(44 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్స్లతో 52) ఒక్కడే హాఫ్ సెంచరీతో రాణించాడు. కెప్టెన్ సాద్ బిన్ జఫర్(21 బంతుల్లో ఫోర్తో 10), కలీమ్ సనా(14 బంతుల్లో సిక్స్తో 13 నాటౌట్) మినహా అంతా సింగిల్ డిజిట్కే పరిమితమయ్యారు.

పాకిస్థాన్ బౌలర్లలో మహమ్మద్ అమీర్(2/13), హ్యారీస్ రౌఫ్(2/26) నిప్పులు చెరగగా.. షాహిన్ షా అఫ్రిది, నసీమ్ షా తలో వికెట్ తీసారు.
అనంతరం లక్ష్యచేధనకు దిగిన పాకిస్థాన్ 17.3 ఓవర్లలో 3 వికెట్లకు 107 పరుగులు చేసి గెలుపొందింది. మహమ్మద్ రిజ్వాన్(53 బంతుల్లో 2 ఫోర్లు, సిక్స్తో 53 నాటౌట్) అజేయ హాఫ్ సెంచరీతో రాణించగా.. బాబర్ ఆజామ్(33 బంతుల్లో ఫోర్, సిక్స్తో 33) కీలక ఇన్నింగ్స్ ఆడాడు.
ఓపెనర్ సయీమ్ ఆయుబ్(6) దారుణంగా విఫలమవ్వగా.. బాబర్ ఆజామ్, రిజ్వాన్ జట్టును ఆదుకున్నారు. ఈ ఇద్దరూ రెండో వికెట్కు 63 పరుగులు జోడించారు. బాబర్ ఆజామ్(33), ఫకార్ జమాన్(4) ఔటైనా.. ఉస్మాన్ ఖాన్(2 నాటౌట్0 సాయంతో రిజ్వాన్ విజయ లాంఛనాన్ని పూర్తి చేశాడు. కెనడా బౌలర్లలో జెరెమీ గోర్డన్ ఓ వికెట్ తీయగా.. డిలన్ హైలర్(2/18) రెండు వికెట్లు పడగొట్టాడు.