కివీస్ కేవలం 4 పరుగుల తేడాతో
పాక్-న్యూజిలాండ్ మధ్య జరిగిన టెస్టు మ్యాచ్ నాటకీయ శైలిలో జరిగిన ముగింపు టెస్టు క్రికెట్కు చక్కని ప్రచారమని న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ అన్నాడు. ‘ఏదేమైనా గెలవాల్సిందే'అనే తన జట్టు వైఖరిని ప్రశంసించాడు. పాకిస్థాన్తో జరిగిన తొలి టెస్టులో కివీస్ కేవలం 4 పరుగుల తేడాతో విజయం సాధించింది. కేవలం 4పరుగుల గెలుపు అంతరంతో న్యూజిలాండ్ గెలిచింది. టెస్టు క్రికెట్లో ఇది ఐదో అతి తక్కువ గెలుపు అంతరం.
వార్మర్.. స్మిత్లపై నిషేదం కొనసాగించాలి: క్రికెట్ ఆస్ట్రేలియా
మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్గా అజాజ్
తొలి ఇన్నింగ్స్లో కివీస్ 153 పరుగులు చేయగా పాక్ 227తో నిలిచింది. రెండో ఇన్నింగ్స్లో విలియమ్సన్ సేన 249 పరుగులు చేసింది. పాక్కు 175 పరుగులు లక్ష్యం నిర్దేశించింది. ఛేదనలో పాక్ 130/4తో పటిష్ఠ స్థితిలో ఉంది. అయితే కివీస్ అరంగేట్రం స్పిన్నర్ అజాజ్ పటేల్ 5/59తో పాక్ నడ్డి విరిచాడు. అత్యంత ఉత్కంఠకరంగా సాగిన ఛేదనలో అజాజే ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్'గా నిలిచాడు. అజాజ్ ముంబైకి చెందినవాడు కావడం విశేషం. అతడికి తోడుగా ఇష్ సోధి 2/37, నీల్ వాగ్నర్ 2/27తో రాణించారు.
నా కెరీర్లో అత్యుత్తమ విజయం
విజయం సాధించిన తర్వాత కివీస్ కెప్టెన్ విలియమ్సన్ మీడియాతో మాట్లాడాడు. ‘ఇది నిజంగా నాటకీయమే. రెండు జట్లూ 4 రోజులు అత్యంత ఒత్తిడి ఎదుర్కొన్నాయి. చివరికి టెస్టు క్రికెట్కు మంచి ప్రచారం లభించింది. పిచ్ రెండు జట్లకు సవాల్గా నిలిచింది. పాకిస్థాన్ కాస్త పైచేయి సాధించింది. మొక్కవోని పట్టుదలతో ఆడటం కలిసొచ్చింది. ఇది నా కెరీర్లో అత్యుత్తమ విజయం అనడంలో సందేహం లేదు' అని విలియమ్సన్ పేర్కొన్నాడు.