
అర్థర్పై వేటు:
విమర్శల నేపథ్యంలో పాక్ బోర్డు దిద్దుబాటు చర్యలకు దిగింది. ఇందులో భాగంగానే పీసీబీ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రధానంగా కోచ్, కెప్టెన్ను మార్చాలనే యోచనలో ఉంది. అంతేకాదు ఈ నెల 15తో ముగుస్తున్న పాక్ కోచింగ్ బృందం కాంట్రాక్టును పొడగించకూడదని నిశ్చయించుకుందని సమాచారం. ఇదే నిజమయితే 2016 నుంచి పాక్ క్రికెట్ జట్టుకు సేవలందిస్తున్న మికీ అర్థర్పై కూడా వేటు పడనుంది.

పీసీబీ కఠిన నిర్ణయం:
అర్థర్తో పాటు బ్యాటింగ్ కోచ్ గ్రాంట్ ఫ్లవర్, బౌలింగ్ కోచ్ అజహర్ మహ్మద్, ఇతర సిబ్బందిని కూడా కొనసాగించకూడదని పీసీబీ కఠిన నిర్ణయం తీసుకుందట. ప్రపంచకప్లో పాక్ వైపల్యానికి కోచింగ్ బృందం పొరపాట్లు కూడా ఉన్నాయని పీసీబీ గట్టిగా నమ్ముతోంది. ఇక కెప్టెన్ను మార్చాలనే యోచనలో కూడా ఉందట. కొత్త కోచ్ ఎంపిక ప్రక్రియను త్వరలోనే ప్రారంభించనున్నట్లు పీసీబీకి చెందిన ఓ అధికారి తెలిపారు.
'ప్రతి ఓవర్ మొదటి బంతితో పిచ్ పరిస్థితులను అంచనా వేస్తా'

శ్రీలంకకు కోచ్గా:
పీసీబీ మేనేజింగ్ డైరెక్టర్ వసీం ఖాన్ అధ్యక్షతన శుక్రవారం జరిగిన ఈ సమావేశంలో అర్థర్ పాల్గొన్నాడు. ఈ సందర్భంగా ఆర్థర్ బోర్డుకు ఓ నివేదిక సమర్పించాడు. కెప్టెన్గా సర్ఫరాజ్ను మూడు ఫార్మాట్ల నుంచి తొలగించండి అని అందులో పేర్కొన్నాడని సమాచారం తెలుస్తోంది. తన పర్యవేక్షణలో పాక్ మంచి ప్రదర్శన చేసింది. మరో రెండేళ్లు తన పదవిని పొడిగించాలని ఆర్థర్ కోరాడట. మరోవైపు శ్రీలంక క్రికెట్ జట్టు ప్రధాన కోచ్ కోసం దరఖాస్తు చేసుకున్నట్లు కూడా సమాచారం తెలుస్తోంది.


Click it and Unblock the Notifications












