గొడ్డు మాంసంతో చేసిన పాస్తాను
ఇటీవల ఇంగ్లాండ్లో లార్డ్స్ టెస్టు సందర్భంగా భోజనశాలలో గొడ్డు మాంసంతో చేసిన పాస్తాను మిగతా వంటకాల పక్కన పెట్టడం కొందరు భారత ఆటగాళ్లకు ఇబ్బందిగా మారింది. ఆస్ట్రేలియా పర్యటనలో ఈ సమస్య తలెత్తకుండా ముందే బీసీసీఐ జాగ్రత్త పడింది. భారత ఆటగాళ్ల కోసం ఆస్ట్రేలియాలోని ఒక ప్రముఖ భారతీయ రెస్టారెంట్ నుంచి ప్రత్యేకంగా వంటకాలు తయారు చేయించి స్టేడియాలు, మైదానాల్లో అందుబాటులో ఉంచనున్నట్లు సమాచారం.
వాళ్లు లేనప్పుడే ఆస్ట్రేలియాను గెలవాలి: సచిన్
ఆస్ట్రేలియాలోని భారత రెస్టారెంట్తో ఒప్పందం
‘జట్టులో కొందరు శాకాహారులున్నారు. వారికి కూరలు సరఫరా చేసేందుకు ఆస్ట్రేలియాలోని భారత రెస్టారెంట్తో ఆ కమిటీ ఒప్పందం చేసుకుంది' అని ఓ బీసీసీఐ అధికారి వెల్లడించారు. లార్డ్స్ రెస్టారెంట్ మెనూలో బీఫ్ పాస్తా ఉండడంతో పలువురు భారత క్రికెట్ అభిమానులు బీసీసీఐపై ఆగ్రహం వ్యక్తంజేశారు.
కెప్టెన్ కోహ్లీ మెనూ మాత్రం ప్రత్యేకం
ఇదిలా ఉంచితే కెప్టెన్ కోహ్లీ మెనూ మాత్రం ప్రత్యేకంగా ఉంటుందట. నాలుగు నెలలుగా విరాట్ జంతు, పక్షి సంబంధిత ఆహారానికి దూరంగా ఉన్నాడని.. వీగన్ గా సెటిలయ్యాడని తెలుస్తోంది. రెండు మూడేళ్లుగా విరాట్ కొహ్లీ ఫిట్నెస్లో అనూహ్యమైన మార్పులను క్రికెట్ అభిమానులంతా గమనిస్తూనే ఉన్నారు. కొహ్లీ అద్భుతమైన ఫిట్నెస్ను సంతరించుకున్నప్పటి నుంచి అద్వితీయమైన ఫామ్ను కూడా కొనసాగిస్తూ ఉన్నాడు.
పాలు, పెరుగు, గుడ్డుకు కూడా పూర్తి దూరంగా
ఈ నేపథ్యంలో కొహ్లీ శారీరక ఫిట్నెస్ కోసం డైట్లో కీలకమైన మార్పును కూడా చేసుకుంటున్నాడని తెలుస్తోంది. నాలుగు నెలల నుంచి కొహ్లీ పూర్తి శాకాహారాన్నే తీసుకుంటున్నాడని, మాంసానికి పూర్తి దూరం అయ్యాడు. ఆఖరికి పాలు, పెరుగు, గుడ్డుకు కూడా పూర్తి దూరంగా ఉంటున్నాడట టీమిండియా కెప్టెన్. తను తీసుకునే ఆహారంలో ఎక్కడా వీటి ఊసే ఉండటం లేదని సమాచారం.