
ప్రణాళికల తగ్గట్లు బ్యాటింగ్ చేయలేక...
'ఈ ఓటమి చాలా నిరాశకు గురి చేసింది. తొలి రెండు మ్యాచ్ల్లో మేం అద్భుతంగా రాణించాం. మా సాయశక్తులా ఆడాం. మా ప్లేయర్లు కూడా అద్భుత ప్రదర్శన కనబర్చారు. కానీ చాలా మ్యాచ్లను మేం తృటిలో కోల్పోయాం. డక్వర్త్ లూయిస్ ఆటలో భాగమైతే అది బ్యాటింగ్ విభాగానికి సవాల్లాంటిది. ఈ మ్యాచ్లో మేం భాగస్వామ్యాలు నెలకొల్పాం. కానీ మేం అనుకున్న రితీలో మా బ్యాటింగ్ కొనసాగలేదు. అది మా ఓటమికి కారణమైంది.

టీ20 సిరీస్లో సత్తా చాటుతాం..
జట్టులో కొంత మంది అనుభవం లేని ఆటగాళ్లు ఉన్నారు. వన్డే క్రికెట్ ఆడటానికి ప్రయత్నిస్తున్నారు. న్యూజిలాండ్తో అప్ కమింగ్ వన్డే సిరీస్లో సత్తా చాటుతాం. ఈ సిరీస్లో మా ఆత్మవిశ్వాసం రెట్టింపు అయ్యింది. పవర్ ప్లేలో మా బౌలర్లు అద్భుతంగా బౌలింగ్ చేశారు. కాకపోతే వికెట్లు తీయలేకపోయారు. ప్రతీ మ్యాచ్కు మా ఆటగాళ్లకు రెట్టించిన ఉత్సహాన్ని అందుకున్నారు. మా టీ20 జట్టు పట్ల ఉత్సహంగా ఉన్నా. భారత్తో టీ20 సిరీస్లో ప్రేక్షకులను అలరించేందుకు ప్రయత్నిస్తాం.'అని పూరన్ చెప్పుకొచ్చాడు.

పాపం శుభ్మన్ గిల్
ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన టీమిండియా వర్షంతో మ్యాచ్ ఆగిపోయే సమయానికి 36 ఓవర్లలో 3 వికెట్లకు 225 పరుగులు చేసింది. శుభ్మన్ గిల్ ( 98 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్స్లతో 98 నాటౌట్)సెంచరీకి 2 పరుగుల దూరంలో నిలవగా.. శిఖర్ ధావన్(74 బంతుల్లో 7 ఫోర్లతో 58) హాఫ్ సెంచరీతో రాణించాడు. అనంతరం డక్వర్త్ లూయీస్ పద్ధతిన టీమిండియా నిర్దేశించిన 257 పరుగుల లక్ష్యాన్ని వెస్టిండీస్ చేధించలేకపోయింది. 26 ఓవర్లలో 137 పరుగులకే కుప్పకూలింది. వెస్టిండీస్ ఆటగాళ్లలో బ్రాండన్ కింగ్ (42), నికోలస్ పూరన్( 42), హోప్(22) మినహా అంతా విఫలమయ్యారు. భారత బౌలర్లో యుజ్వేంద్ర చహల్ (4/17) నాలుగు వికెట్లతో విండీస్ పతనాన్ని శాసించగా.. సిరాజ్, శార్దూల్ ఠాకూర్ చెరో రెండు వికెట్లు, అక్షర్ పటేల్, ప్రసిద్ధ్ కృష్ణా చెరో వికెట్ పడగొట్టారు.


Click it and Unblock the Notifications












