For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

రూ. 240 కోట్లతో నిర్మాణం.. కూల్చి వేయనున్న న్యూయార్క్ స్టేడియం!

టీ20 ప్రపంచకప్ 2024లో భాగంగా భారత్ వర్సెస్ అమెరికా మధ్య జరిగే మ్యాచ్‌కు న్యూయార్క్‌లోని నాసౌ కౌంటీ క్రికెట్ మైదానం ఆతిథ్యం ఇవ్వనుంది. మరికాసేపట్లో ఈ మ్యాచ్ ప్రారంభం కానుండగా.. ఈ మైదానంలో ఇదే చివరిదిగా తెలుస్తోంది. ఈ మ్యాచ్ అనంతరం ఈ స్టేడియాన్ని కూల్చివేయనున్నట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది.

అమెరికాలో క్రికెట్‌కు ఆదరణ పెంచాలనే లక్ష్యంతో అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్(ఐసీసీ) టీ20 ప్రపంచకప్ 2024 ఆతిథ్య దేశంగా ఎంపిక చేసింది. లీగ్ మ్యాచ్‌లను న్యూయార్క్‌తో పాటు ఫ్లోరిడా, డల్లాస్‌లో నిర్వహించింది. ఈ టోర్నీ కోసం ఐసీసీ ఏకంగా రూ. 240 కోట్లతో న్యూయార్క్‌లో నాసౌ కౌంటీ క్రికెట్ స్టేడియాన్ని నిర్మించింది. మూడు నెలల్లోనే 34 వేల సీటింగ్ కెపాసిటీతో ఈ స్టేడియాన్ని అందుబాటులోకి తెచ్చింది.

New York Stadium will be dismantled after the T20 World Cup 2024

అయితే ఈ స్టేడియంలో డ్రాప్ ఇన్ పిచ్‌లను రెడీ చేయడంతో అన్నీ మ్యాచ్‌లు లో స్కోరింగ్ గేమ్స్‌గా మారాయి. ముఖ్యంగా బ్యాటర్లు అనూహ్య బౌన్స్, టర్న్, పేస్‌తో ఇబ్బంది పడ్డారు. దాంతో ఈ మైదానంపై తీవ్ర విమర్శలు వచ్చాయి. దాంతో అభిమానులు కోరుకున్న అసలు సిసలు మజా లభించలేదు. ఏడు మ్యాచ్‌ల్లో ఏ జట్టు కూడా 140 పరుగులు చేయలేదు.

టీ20 ప్రపంచకప్ 2024 కోసం తాత్కలికంగా ఈ స్టేడియాన్ని నిర్మించారు. ఈ టోర్నీ అనంతరం కూల్చేయనున్నారు. ఈ వార్త క్రికెట్ అభిమానులను ఆశ్చర్యానికి గురి చేస్తోంది. 7 మ్యాచ్‌ల కోసం రూ. 240 కోట్లు ఖర్చు పెట్టారా? అని ప్రశ్నిస్తున్నారు. అయితే అమెరికాలో క్రికెట్‌కు ఆదరణ పెంచి.. ఒలింపిక్స్‌లో భాగం చేయాలని ఐసీసీ ప్రయత్నిస్తోంది. ఈ క్రమంలోనే ఖర్చుకు వెనుకాడటం లేదు.

Story first published: Wednesday, June 12, 2024, 19:34 [IST]
Other articles published on Jun 12, 2024
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+