చాహల్ ఎందుకు..?
ఈ నిర్ణయమే అభిమానుల ఆగ్రహానికి కారణమైంది. దారుణంగా విఫలమైన యుజ్వేంద్ర చాహల్ను పక్కనపెట్టకుండా బిష్ణోయ్ను పక్కన పెట్టడం ఏందని అభిమానులు ప్రశ్నిస్తున్నారు. సీనియర్ క్రికెటరనే చాహల్ను కొనసాగించారా? అని మండిపడుతున్నారు. రవిచంద్రన్ అశ్విన్ను తీసుకోవడం మంచి నిర్ణయమే అయినప్పటికీ బిష్ణోయ్ను పక్కనపెట్టాల్సింది కాదని, చాహల్పై వేటు వేయాల్సిందని అభిప్రాయపడుతున్నారు. ఆటను చూడకుండా పేరును చూసి ఎంపిక చేయడం ఏంటని మండిపడుతున్నారు.
పంత్కు మరో చాన్స్..
రిషభ్ పంత్కు కూడా మరో అవకాశం ఇవ్వడంపై నెటిజన్లు పెదవి విరుస్తున్నారు. గత మ్యాచ్లో పేలవ షాట్తో జట్టు ఓటమికి కారణమైన పంత్ను పక్కనపెట్టాల్సిందని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. టీ20 ప్రపంచకప్ ప్రణాళికల్లో దినేశ్ కార్తీక్ను తీసుకోవాలని సూచిస్తున్నారు. అయితే రవీంద్ర జడేజా గాయం కార్తీక్ కొంప ముంచిందని, లెఫ్టాండర్ బ్యాటర్ జట్టులోలేకపోవడం పంత్కు కలిసొస్తుందని కామెంట్ చేస్తున్నారు.
అందుకే అశ్విన్..
శ్రీలంక జట్టు బ్యాటింగ్ విభాగం ఆధారంగానే రవిచంద్రన్ అశ్విన్ను జట్టులోకి తీసుకోచ్చామని రోహిత్ తెలిపాడు. శ్రీలంకలో ఎక్కువగా లెఫ్టార్మ్ బ్యాటర్లు ఉన్న నేపథ్యంలోనే అశ్విన్ను తీసుకున్నామని వెల్లడించాడు. ఇది టీమ్ ప్రణాళికని పేర్కొన్నాడు. ఇక టాస్ గెలిస్తే తాము కూడా ఫీల్డింగ్ ఎంచుకునేవాళ్లమని, పిచ్ ఏ మాత్రం మారలేదన్నాడు. ఈ రోజు వికెట్పై గడ్డి తక్కువగా ఉందని, పూర్తిగా డ్రైగా ఉందన్నాడు. ఈ క్రమంలోనే అశ్విన్ను తీసుకొచ్చామని తెలిపాడు.
13 పరుగులకే 2 వికెట్లు..
టీమిండియాకు ఆదిలోనే గట్టి షాక్ తగిలింది. ఓపెనర్ కేఎల్ రాహుల్(6), విరాట్ కోహ్లీ(0) వెనువెంటనే ఔటయ్యారు. తీక్షణ వేసిన రెండో ఓవర్లో రాహుల్ అంపైర్ తప్పిదం కారణంగా ఎల్బీ డబ్ల్యూ కాగా.. దిల్షాన్ మదుషంక బౌలింగ్లో కోహ్లీ క్లీన్ బౌల్డ్ అయ్యాడు. దాంతో భారత్ 13 పరుగులకే రెండు కీలక వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ప్రస్తుతం క్రీజులోరోహిత్ శర్మ(4 బ్యాటింగ్)తో పాటు సూర్యకుమార్ యాదవ్ ఉన్నాడు.


Click it and Unblock the Notifications
