గొప్ప బౌలర్ కాదంటూ..
వార్న్ అకాల మరణం నేపథ్యంలో ఇండియా టుడే హోస్ట్ రాజ్దీప్ సర్దేశాయ్ ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించగా.. సునీల్ గవాస్కర్ గెస్ట్గా పాల్గొన్నాడు. ఈ సందర్భంగా గవాస్కర్ షేన్ వార్న్పై అనుచిత వ్యాఖ్యలు చేశాడు. సందర్భానుసారం మాట్లాడకుండా అర్థం పర్దం లేని వ్యాఖ్యలు చేశాడు. షేన్ వార్న్ లెజండరీ స్పిన్నరని తాను ఏ మాత్రం అంగీకరించనని, భారత్తో అతను దారుణంగా విఫలమయ్యాడని చెప్పుకొచ్చాడు.

భారత్తో విఫలమయ్యాడని..
'డేవిడ్ వార్నర్ ఆల్టైమ్ గ్రేటెస్ట్ స్పిన్నర్ అంటే నేను అంగీకరించను. అతని కంటే భారత స్పిన్నర్లు, ముత్తయ్య మురళీ ధరన్ గొప్ప బౌలర్లు. ఎందుకంటే భారత్పై అతని రికార్డులు అంత గొప్పగా లేవు. భారత్పై ఆర్దినరీ రికార్డ్స్ ఉన్నాయి. ఒకేసారి నాగ్పూర్ వేదికగా జరిగిన ఓ మ్యాచ్లో ఐదు వికెట్లు తీసాడు. భారత్లో అంత గొప్పగా రాణించలేదు కాబట్టే భారత జట్టు అంత సక్సెస్ సాధించలేదు. అందుకే మురళీ ధరణ్ గొప్ప బౌలరని చెబుతున్నా'అని వార్న్ చెప్పుకొచ్చాడు.

గవాస్కర్ బుద్దుందా?
ఈ వ్యాఖ్యలపై భారత అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఏ సందర్భంలో ఎలాంటి వ్యాఖ్యలు చేస్తున్నావని మండిపడుతున్నారు. ఇంగిత జ్ఞానం లేకుంటే ఎలా అని కామెంట్ చేస్తున్నారు. సునీల్ గవాస్కర్.. ఎప్పుడూ ఇలానే మాట్లాడుతాడని, అతని వ్యక్తిగత అభిప్రాయాలను ఇతరులపై రుద్దే ప్రయత్నం చేస్తాడని ఘాటుగా విమర్శిస్తున్నారు.


Click it and Unblock the Notifications












