నెక్ జర్నలిస్ట్ ప్రీమియర్ లీగ్ (జేపీఎల్) రెండో సీజన్కు రంగం సిద్దమైంది. స్పోర్ట్స్ జర్నలిస్ట్ అసోసియేషన్ తెలంగాణ (ఎస్జాట్) ఆధ్వర్యంలో డిసెంబర్ 7 నుంచి ఐదు రోజుల పాటు దుండిగల్లోని ఎంఎల్ఆర్ఐటీ క్రికెట్ గ్రౌండ్స్లో ఈ టీ20 టోర్నీ జరగనుంది. తొలి సీజన్ తరహాలోనే మొత్తం పది మీడియా సంస్థల జట్లు ఈ టోర్నీలో పోటీపడుతున్నాయి. ఈ టోర్నీ ట్రోఫీ ఆవిష్కరణ కార్యక్రమం గురువారం ఫిల్మ్నగర్ కల్చరల్ క్లబ్ సెంటర్ (ఎఫ్ఎన్సీసీ)లో ఘనంగా జరిగింది.
మాజీ క్రికెటర్, బీసీసీఐ అపెక్స్ కౌన్సిల్ సభ్యుడు చాముండేశ్వర్నాథ్, ఎన్ఈసీసీ బిజెనెస్ ఏజీఎం సంజీవ్ చింతావర్ ముఖ్య అతిథులుగా హాజరై ఈ ట్రోఫీని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా చాముండేశ్వర్ నాథ్ మాట్లాడుతూ.. జర్నలిస్టులందరూ ఇలా ఒక వేదికగా క్రికెట్ ఆడుతుండటం అభినందీయమని అన్నారు. మీడియా సంస్థలన్నింటిని కలిపి జేపీఎల్ను నిర్వహిస్తున్న స్పోర్ట్స్ జర్నలిస్ట్ అసోసియేషన్ తెలంగాణ (ఎస్జాట్)ను ప్రత్యేకంగా అభినందించారు. క్రికెటర్ల ఆటతీరు, మ్యాచ్ ఫలితాలపై తమదైన శైలిలో విశ్లేషణలు చేసే జర్నలిస్టులకు ఇప్పడు ఆటగాళ్ల కష్టాలు, వారు పడే శ్రమ ఈ జేపీఎల్ ద్వారా అర్ధమవుతుందని చాముండేశ్వర్ నాథ్ చమత్కరించారు.

ఈ టోర్నీ రన్నరప్ ట్రోఫీని స్పోర్టీఓ మేనేజింగ్ డైరెక్టర్ సి.భరత్ రెడ్డి, మ్యాచ్ అవార్డ్స్ను ఇండీ రేసింగ్ యజమాని కె.అభిషేక్ రెడ్డి, క్రిక్ క్లబ్స్ సీఈఓ గణేష్ ఆవిష్కరించారు. ప్లేయర్ ఆఫ్ ద టోర్నీకి ఎంఎల్ఆర్ మోటర్స్ నుంచి రూ.1 లక్ష 25 వేలు ఖరీదు గల ఈవీ స్కూటర్ను బహుమతిగా ప్రదానం చేయనున్నామని నిర్వాహకులు ప్రకటించారు.
ఈ కార్యక్రమంలో 10 జట్ల కెప్టెన్లతో పాటు స్పోర్టీవో మేనేజింగ్ డైరెక్టర్ సి.భరత్ రెడ్డి, ఇండీ రేసింగ్ యజమాని కె.అభిషేక్ రెడ్డి, జుపర్ ఎల్ ఈడీ సంస్థ డైరెక్టర్ ఒరుసు రమేష్, క్రిక్ క్లబ్స్ సీఈఓ గణేష్, హెచ్సీఏ మాజీ కార్యదర్శి విజయానంద్ తదితరులు పాల్గొన్నారు.