For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

రిషభ్ పంత్‌ను ఎంపిక చేస్తే అప్పడు తిట్టని తిట్టూ తిట్టారు: ఎమ్మెస్కే ప్రసాద్

MSK Prasad says Rishabh Pants selection was controversial, people said he cant bat in Tests
Rishabh Pant's selection was controversial, people said he can't bat in Tests: MSK Prasad

హైదరాబాద్‌: టీమిండియా విధ్వంసకర వికెట్ కీపర్ కమ్ బ్యాట్స్‌మన్‌ రిషభ్ పంత్‌ను తొలిసారి టెస్ట్‌ల్లోకి ఎంపిక చేసినప్పుడు తిట్టని తిట్టూ తిట్టారని మాజీ చీఫ్ సెలెక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్ గుర్తు చేసుకున్నాడు. అతని ఎంపిక అప్పట్లో ఓ పెద్ద వివాదానికి దారి తీసిందన్నాడు. 2014లో మాజీ కెప్టెన్ ధోనీ టెస్టులకు రిటైర్మెంట్‌ ప్రకటించిన తర్వాత ఫస్ట్ చాయిస్ వికెట్ కీపర్‌గా వృద్ధిమాన్ సాహా జట్టులోకి వచ్చాడని తెలిపాడు. అతను భారత్‌లోనే కాకుండా విదేశాల్లోనూ మెరుగ్గా రాణిస్తున్న తరుణంలో ఆకస్మాత్తుగా రిషభ్ పంత్‌ను తమ సెలెక్షన్ టీమ్ తెరపైకి తెచ్చిందని, దీంతో ఆ సమయంలో తమపై తీవ్ర స్థాయిలో విమర్శలు వ్యక్తమయ్యాయని తాజాగా ఓ క్రికెట్ వెబ్‌సైట్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఎమ్మెస్కే గుర్తు చేసుకున్నాడు.

పెద్ద వివాదం..

పెద్ద వివాదం..

'రిషభ్ పంత్‌ను అప్పట్లో టెస్టుల్లోకి ఎంపిక చేయగానే పెద్ద ఎత్తున వివాదం చెలరేగింది. చాలా మంది పంత్‌ టెస్టులకు పనికిరాడని, అతని దూకుడు టెస్ట్‌ ఫార్మాట్‌కు సరిపోదని, కీపింగ్ విషయంలో ఫిట్‌నెస్‌ విషయంలో అలక్ష్యంగా ఉంటాడని విమర్శలు గుప్పించారు. కానీ పంత్ వాటికి తన ఆటతోనే బదులిచ్చాడు. 2019 వన్డే ప్రపంచకప్ తర్వాత పంత్ ఘోరంగా విఫలమయినా.. ఆస్ట్రేలియా గడ్డపై తిరుగులేని ప్రదర్శన కనబర్చాడు. ఆ తర్వాత ఇంగ్లండ్‌పైనా అద్భుత ఇన్నింగ్స్‌లు ఆడాడు.

సూపర్ కీపింగ్..

సూపర్ కీపింగ్..

భారత్‌‌లోని టర్నింగ్ పిచ్‌లపై సైతం చక్కగా కీపింగ్ చేస్తున్నాడు. చాలెంజింగ్ కండీషన్లలో కూడా మెరుగ్గా బ్యాటింగ్ చేస్తున్నాడు. సెలెక్టర్‌గా ప్రతిభని గుర్తించడం నా బాధ్యత. ఆ క్రమంలోనే పంత్‌‌ను టెస్ట్‌లకు ఎంపిక చేశాం. మా నమ్మకాన్ని పంత్‌ వమ్ము చేయలేదు. రెండేళ్ల కిందట చాలా మంది పంత్ ఈ స్థాయిలో రాణిస్తాడని ఊహించలేదు. అతన్ని విమర్శించిన వారే నేడు ప్రశంసలు కురిపిస్తున్నారు. వరల్డ్ టెస్ట్ చాంపియన్‌షిప్ ఫైనల్లో కూడా పంత్ కీలకం అవుతాడు. అతను ఫామ్ కొనసాగిస్తే భారత్‌కు తిరుగుండదు.'అని ఎమ్మెస్కే చెప్పుకొచ్చాడు.

ఆ ఇద్దరూ ఆడాల్సిందే..

ఆ ఇద్దరూ ఆడాల్సిందే..

ఈ మెగా ఫైనల్లో కోహ్లీసేన.. రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్ ఇద్దరితో బరిలో దిగాల్సిందేనన్నాడు. స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా గైర్హాజరీ నేపథ్యంలో జడేజా, అశ్విన్ సూపర్ ఫామ్ కలిసొస్తుందన్నాడు. 'నా అభిప్రాయప్రకారం ఇద్దరు స్పిన్నర్లు ఆడాల్సిందే. ఒకవేళ హార్దిక్ పాండ్యా గనుక జట్టులో ఉండి ఉంటే.. అక్కడి పరిస్థితులు అతనికి కలిసొచ్చేవి. అప్పడు నేను ఒకే స్పిన్నర్‌తో ఆడాలని చెప్పేవాడిని. పాండ్యా లేడు కాబట్టి రవీంద్ర జడేజాను బ్యాట్స్‌మన్‌గా ట్రీట్ చేయాలి. ఎందుకంటే అతను మూడు ఫార్మాట్లలో దుమ్మురేపుతున్నాడు. అతనో కంప్లీట్ ప్యాకెజ్'అని ఎమ్మెస్కే చెప్పుకొచ్చాడు.

బిగ్ బ్లండర్..

బిగ్ బ్లండర్..

అంతేకాకుండా అశ్విన్ పక్కనపెడితే పెద్ద తప్పిదమవుతుందన్నాడు. 'అశ్విన్‌ను తుది జట్టులోకి తీసుకోకుంటే పెద్ద తప్పిదం అవుతుంది. అక్కడి పరిస్థితులు భిన్నమైనవి అనే విషయం నాకు తెలుసు. కానీ అనుభవం, ఫామ్ దృష్ట్యా అశ్విన్‌ను తీసుకోవాల్సిందే. అంతేకాకుండా ఐదుగురు బౌలర్లతో బరిలోకి దిగాలి.'అని ఎమ్మెస్కే సూచించాడు. ఇక 2016 నుంచి 2020 వరకు చీఫ్ సెలెక్టెర్‌గా పని చేసిన ఎమ్మెస్కే.. ప్రస్తుతం తెలుగు కామెంటేటర్‌గా వ్యవహరిస్తున్నాడు. జూన్ 18-23 వరకు సౌతాంప్టన్ వేదికగా జరిగే డబ్యూటీసీ ఫైనల్‌లో న్యూజిలాండ్‌తో తలపడనుంది. అనంతరం ఆగస్టు 4 నుంచి సెప్టెంబరు 14 మధ్యలో ఇంగ్లండ్‌తో ఐదు టెస్టుల సిరీస్‌ ఆడనుంది.

Story first published: Wednesday, June 9, 2021, 22:44 [IST]
Other articles published on Jun 9, 2021
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+