
హైదరాబాద్: భారత మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ శనివారం అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు పలికిన విషయం తెలిసిందే. . 'కెరీర్ ఆసాంతం నన్ను ప్రేమించి, మద్దతుగా నిలిచిన మీ అందరికీ ధన్యవాదాలు. 19:29 గంటల నుంచి నేను వీడ్కోలు పలికినట్టుగా భావించండి' అని ఓ వీడియోను ఇన్స్టా వేదికగా షేర్ చేసి యావత్ క్రికెట్ ప్రపంచానికి షాకిచ్చాడు. దీంతో ధోనీ అభిమానులు, మాజీ క్రికెటర్లు, అతని సహచర ఆటగాళ్లు సోషల్ మీడియా వేదికగా మహీ రికార్డులను, అతనితో ఉన్న అనుబంధాన్ని నెమరువేసుకుంటున్నారు.
{photo-feature}