చెన్నైలో పబ్లిక్ ఈవెంట్:
వివాహానంతర జీవితం గురించి ధోనీ చేసిన ఒక సరదా ప్రసంగానికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయింది. ప్రముఖ మ్యాట్రిమోనియల్ సంస్థ 'భారత్ మ్యాట్రిమోనియల్' తాజాగా చెన్నైలో ఒక పబ్లిక్ ఈవెంట్ నిర్వహించింది. భారత్ మ్యాట్రిమోనియల్ సంస్థకు బ్రాండ్ అంబాసిడర్గా ఉన్న ధోనీ.. ఈ ఈవెంట్లో పాల్గొని ఒక ఆదర్శ భర్త ఎలా ఉండాలి? అనే దానిపై స్పీచ్ ఇచ్చాడు. అంతేకాదు తన 'హ్యాపీ మ్యారేజ్' లైఫ్ సీక్రెట్ ఏంటో కూడా తెలిపాడు.
పెళ్లయ్యే దాకా మగాళ్లంతా సింహాలే:
ధోనీ మాట్లాడుతూ... 'ఏ పనీచేయకుండా కూర్చునే ఉండే భర్తలకంటే నేను చాలా బెటర్. నేనొక ఆదర్శవంతమైన భర్తను. అంతకంటే ఎక్కువే అనుకుంటున్నా. నా భార్య సాక్షి ఏం చేయాలనుకున్నా తోడ్పాటు అందిస్తా. నా భార్య ఏదీ కోరినా నేను అంగీకరిస్తాను. ఎందుకంటే.. భార్యలు సంతోషంగా ఉంటేనే భర్తలు కూడా సంతోషంగా ఉంటారు. నా భార్య ఏది చెప్పినా.. నా నుంచి అవును అని సమాధానం వస్తుంది. మగాళ్లు పెళ్లి అయ్యేంత వరకే సింహాలు' అని సరదాగా పేర్కొన్నాడు.
తాత్కాలిక విరామం:
చివరిసారిగా ప్రపంచకప్ సెమీఫైనల్లో ఆడిన ధోనీ మైదానంలోకి దిగి దాదాపు ఐదు నెలలు అవుతోంది. ప్రపంచకప్ ముగిసిన అనంతరం భారత ఆర్మీలో పనిచేయాలని రెండు నెలలు క్రికెట్కు తాత్కాలిక విరామం ప్రకటించాడు. విరామం సమయం ముగిసి కూడా మరో మూడు నెలలు కావస్తున్నా.. ధోనీ భారత సెలెక్టర్లకు ఇప్పటివరకు ఎలాంటి సమాచారం ఇవ్వలేదు. ఇంతకు ధోనీ తిరిగి టీమిండియాకు ఎప్పుడు ఆడతాడా స్పష్టత లేదు.
బాడీబిల్డింగ్ ఛాంపియన్షిప్లో బంగారు పతకం.. అనుజ్ కుమార్కు ఘన స్వాగతం పలికిన ఆర్మీ
రవిశాస్త్రి కీలక వ్యాఖ్యలు:
ధోనీ రిటైర్మెంట్ వార్తలు హల్చల్ చేస్తున్న నేపథ్యంలో టీమిండియా కోచ్ రవిశాస్త్రి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ధోనీ ఇప్పట్లో అంతర్జాతీయ క్రికెట్ నుంచి వైదొలగబోరని ఆయన స్పష్టమైన సంకేతాలు ఇచ్చారు. 'ఐపీఎల్లో ధోనీ ఎలా ఆడుతున్నాడన్న దానిపైనే ఇది ఆధారపడి ఉంటుంది. ఐపీఎల్ పెద్ద టోర్నమెంట్. అందులో ఎలా ఆడుతున్నారన్నది గమనించిన తర్వాత టీ20 వరల్డ్కప్ కోసం తుది జట్టును ప్రకటిస్తారు' అని రవిశాస్త్రి తెలిపాడు.