టీమిండియా స్టార్ పేసర్, హైదరాబాద్ డీఎస్పీ మహమ్మద్ సిరాజ్ను ఐసీసీ అవార్డ్ వరించింది. ఇంగ్లండ్తో ఐదు టెస్ట్ల అండర్సన్-సచిన్ ట్రోఫీలో సిరాజ్ మెరుగైన ప్రదర్శన చేసినందుకు ఈ అవార్డ్ దక్కింది. ఈ సిరీస్లో ఐదు మ్యాచ్లు ఐదు ఆడిన మహమ్మద్ సిరాజ్ 23 వికెట్లతో సత్తా చాటాడు. అతని ప్రదర్శనతో ఈ సిరీస్ను భారత్ 2-2తో సమం చేసుకుంది.
ముఖ్యంగా ఒవల్ వేదికగా జరిగిన ఆఖరి టెస్ట్లో సిరీస్లో సంచలన ప్రదర్శన కనబర్చాడు. హోరాహోరీగా సాగిన పోరులో సిరాజ్ ఐదు వికెట్లు పడగొట్టి భారత్కు 6 పరుగుల తేడాతో విజయాన్నందించాడు. ఈ ప్రదర్శనతో ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది ఆగస్ట్ మంత్ అవార్డ్ సిరాజ్కు దక్కింది.
ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డ్ రావడం సిరాజ్కు ఇదే తొలిసారి. ఓవరాల్గా ఈ ఘనతను అందుకున్న 9వ బ్యాటర్గా సిరాజ్ నిలిచాడు. అతని కన్నా ముందు రిషభ్ పంత్, భువనేశ్వర్ కుమార్, రవిచంద్రన్ అశ్విన్, శ్రేయస్ అయ్యర్, విరాట్ కోహ్లీ, శుభ్మన్ గిల్, యశస్వి జైస్వాల్, జస్ప్రీత్ బుమ్రా ఈ అవార్డ్ అందుకున్నారు. ఇందులో శుభ్మన్ గిల్ ఒక్కడే నాలుగు సార్లు ఈ అవార్డు అందుకోగా.. బుమ్రా, అయ్యర్ రెండేసి సార్లు స్వీకరించారు.
అంతర్జాతీయ క్రికెట్లో 30 రోజుల్లో మూడు ఫార్మాట్లలో అత్యుత్తమ ప్రదర్శన కనబర్చిన ఆటగాళ్లను ఈ అవార్డ్కు నామినేట్ చేస్తారు. ఆ తర్వాత ఆన్లైన్ ఓటింగ్ ద్వారా విజేతను నిర్ణయిస్తారు. ప్రతి నెల ఐసీసీ ఈ అవార్డ్ ప్రకటిస్తుంది. భారత్ మినహా మరే జట్టు కూడా ఇన్ని అవార్డ్స్ గెలుచుకోలేదు. ఈ ఏడాది ఈ అవార్డ్ అందుకున్న నాలుగో భారత ఆటగాడు సిరాజ్. ఫిబ్రవరి, జూలైలో గిల్, మార్చిలో శ్రేయస్ అయ్యర్ ఈ అవార్డ్ స్వీకరించారు.

ఈ అవార్డ్ అందుకోవడంపై సిరాజ్ సంతోషం వ్యక్తం చేశాడు. 'ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డు అందుకోవడం ప్రత్యేక గౌరవం. అండర్సన్-టెండూల్కర్ ట్రోఫీ మరిచిపోలేని సిరీస్. నేను ఆడిన అత్యంత ఉత్కంఠమైన సిరీస్ల్లో ఇది ఒకటి. ముఖ్యంగా ఈ సిరీస్లో భారత విజయంలో కీలక పాత్ర పోషించినందుకు గర్వంగా ఉంది. ప్రత్యర్థి గడ్డపై వారి టాప్ క్లాస్ బ్యాటింగ్ లైనప్కు బౌలింగ్ చేయడం సవాల్ అయినప్పటికీ... నా అత్యుత్తమ ప్రదర్శనను కనబర్చాను.
ఈ అవార్డ్ క్రెడిట్ నా సహచర ఆటగాళ్లతో పాటు సపోర్ట్ స్టాఫ్ది. వారి ప్రొత్సాహం, నాపై ఉంచిన నమ్మకం నన్ను ముందుకు నడిపించాయి. నేను భారత జెర్సీ ధరించిన ప్రతీసారి నా అత్యుత్తమ ప్రదర్శన ఇచ్చేందుకు ప్రయత్నిస్తాను.'అని సిరాజ్ పేర్కొన్నాడు.