రైళ్లు పరుగెత్తాయి..
మ్యాచ్ అనంతరం శ్రేయస్ అయ్యర్తో సరదాగా మాట్లాడిన సిరాజ్ ఈ విషయాన్ని వెల్లడించాడు. 'నేను నా యార్కర్లను నమ్ముకున్నాను. వాటినే చివరి ఓవర్లో అస్త్రంగా వాడుకున్నాను. కానీ ఆ సమయంలో నా గుండె చాలా వేగంగా కొట్టుకుంది. కానీ నేను మాత్రం మ్యాచ్ గెలిపించగలననే ఆత్మవిశ్వాసంతో బౌలింగ్ చేశాను.'అని సిరాజ్ చెప్పుకొచ్చాడు. ఇక ఈ మ్యాచ్లో 10 ఓవర్లలో 57 పరుగులిచ్చి రెండు కీలక వికెట్లు తీసాడు. షైహోప్తో పాటు విధ్వంసకర నికోలస్ పూరన్ను ఔట్ చేశాడు.

గబ్బర్ సెంచరీ మిస్..
ఈ మ్యాచ్లో టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన భారత్ నిర్ణీత 50 ఓవర్లలలో 7 వికెట్లకు 308 పరుగులు చేసింది. కెప్టెన్ శిఖర్ ధావన్ (99 బంతుల్లో 10 ఫోర్లు, 3 సిక్సర్లతో 97) తృటిలో సెంచరీ చేజార్చుకోగా... శుభ్మన్ గిల్ (53 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్స్లతో 64), శ్రేయస్ అయ్యర్ (57 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్స్లతో 54) హాఫ్ సెంచరీలతో రాణించారు. విండీస్ బౌలర్లలో అల్జారీ జోసెఫ్, గుడకేశ్ మోతీ చెరో 2 వికెట్లు తీయగా.. అకీల్ హోసిన్, రొమరియో షెఫర్డ్ ఒక్కో వికెట్ పడగొట్టారు.

థ్రిల్లింగ్ విక్టరీ..
అనంతరం భారీ లక్ష్యచేధనకు దిగిన వెస్టిండీస్ నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్లకు 305 పరుగులు మాత్రమే చేసి ఓటమిపాలైంది. విండీస్ జట్టులో కైల్ మేయర్స్(68 బంతుల్లో 10 ఫోర్లు, సిక్స్తో 75), బ్రాండన్ కింగ్(66 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్స్లతో 54) హాఫ్ సెంచరీలతో రాణించినా.. చివర్లో అకీల్ హోసిన్(32 బంతుల్లో 2 ఫోర్లతో 32 నాటౌట్), రొమారియో షెఫర్డ్ (25 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్లతో 39 నాటౌట్) చెలరేగినా ఫలితం లేకపోయింది. భారత బౌలర్లలో మహమ్మద్ సిరాజ్, శార్దూల్ ఠాకూర్, చహల్ ముగ్గురూ కూడా రెండేసి వికెట్లు తీశారు.


Click it and Unblock the Notifications
