
ఆర్సీబీతో..
అక్కడి నుంచి సిరాజ్ వెనుదిరిగి చూసుకోలేదు. అప్పటి నుంచి ఆర్సీబీకే ఆడుతున్న సిరాజ్.. ఆటగాడిగా ఎంతో పరిణీతి సాధించాడు. టాప్ క్లాస్ బౌలర్గా మారాడు. దాంతో అప్ కమింగ్ ఐపీఎల్ 2022 సీజన్ కోసం కూడా ఆర్సీబీ సిరాజ్ను రిటైన్ చేసుకుంది. విరాట్ కోహ్లీ(రూ.15 కోట్లు)... గ్లెన్ మ్యాక్స్వెల్ (రూ. 11 కోట్లు)తో పాటు సిరాజ్ను రూ.7 కోట్లకు అంటిపెట్టుకుంది. ఈ క్రమంలో ఫిబ్రవరి 12, 13 తేదీల్లో నిర్వహించనున్న మెగా ఆక్షన్కు సిద్ధమవుతోంది. ఇందులో భాగంగా ప్రమోషన్లు చేపట్టిన ఆర్సీబీ... ఓ పాడ్కాస్ట్ ట్రెయిలర్ను రిలీజ్ చేసింది. ఇందులో సిరాజ్ ఆసక్తికర విషయాలు వెల్లడించాడు.

సెకండ్ హ్యాండ్ కారు..
ఐపీఎల్ ఆడటంతోనే తన జీవితం మారిపోయిందన్న సిరాజ్.. తన మొదటి ఐపీఎల్ జీతంతో మొదటగా కొనుగోలు చేసిన వస్తువులేమిటో తెలిపాడు. ‘ముందుగా నేను ఐఫోన్ 7+ కొన్నాను. ఆ తర్వాత ఓ సెకండ్ హ్యాండ్ కార్. కరోలా(టయోటా). ఎందుకంటే ఐపీఎల్ ఆడే వాళ్లకు కారు ఉండాలి కదా! ఎంతకాలమని ప్లాటినా(బైక్) మీద తిరగుతాను. అందుకే కారు కొన్నా. వాస్తవానికి అప్పుడు నాకు డ్రైవింగ్ రాదు. మా అంకుల్ వాళ్ల కొడుకుకు డ్రైవింగ్ తెలుసు. అందుకే నేను బయటికి వెళ్లిన ప్రతిసారి అతన్నే తీసుకువెళ్లేవాడిని'' అని చెప్పుకొచ్చాడు.

విండోస్ తెరిచే..
‘నిజానికి నా కారులో ఏసీ ఉండేది కాదు. అందుకే బయటకు వెళ్లినపుడల్లా కిటికీలు తెరిచే ఉండేవి. అభిమానులు నన్ను గుర్తుపట్టి చీర్ చేసేవాళ్లు. ఎంతో సంతోషంగా అనిపించేది. ఆ తర్వాత ఏడాదికి మెర్సిడెస్ కొన్నాను.'అని సిరాజ్ చెప్పుకొచ్చాడు. ఇటీవల సౌతాఫ్రికా పర్యటనలో సిరాజ్ అదరగొట్టాడు. తొలి టెస్ట్లో అద్భుతంగా బౌలింగ్ చేశాడు. అయితే రెండో టెస్ట్లో తొడ కండరాల గాయానికి గురైన సిరాజ్.. మూడో టెస్ట్తో పాటు వన్డే సిరీస్కు దూరమయ్యాడు. వెస్టిండీస్తో పరిమిత ఓవర్ల సిరీస్తో మళ్లీ ఎంట్రీ ఇవ్వనున్నాడు.


Click it and Unblock the Notifications
