
ప్రాక్టీస్ మ్యాచ్ లేకపోవడం..
'ఢిల్లీ టెస్టు రెండో ఇన్నింగ్స్ చూశాక నాకేమీ ఆశ్చర్యం కలిగలేదు. ఎందుకంటే ప్రాక్టీస్ మ్యాచ్ కూడా ఆడకుండా ఆసీస్ బరిలోకి దిగింది. జట్టు చేసిన అతి పెద్ద తప్పిదం ఇదే. పరిస్థితులను అర్థం చేసుకోవాలంటే కనీసం ఒక్క ప్రాక్టీస్ మ్యాచ్ అయినా ఆడాలి. అలాగే, తొలి టెస్టుకు తుది జట్టు ఎంపికలో ఘోర తప్పిదం చేశారు.
ఇద్దరు స్పిన్నర్లతో బరిలోకి దిగారు. రెండో టెస్టులో స్వీప్ షాట్లు ఆడే ప్రయత్నం చేసి మూల్యం చెల్లించుకున్నారు. ఇలాంటి పిచ్ పరిస్థితుల్లో స్వీప్, రివర్స్ స్వీప్ షాట్లు ఆడటం సరైంది కాదు. స్పిన్ బౌలింగ్ను ఎదుర్కోవాలంటే స్ట్రెయిట్ బ్యాట్ ఆడాలి. గతంలో నేను ఇలానే బ్యాటింగ్ చేసేవాడిని.

స్వీప్ షాట్లు ఆడటమే..
స్పిన్కు అనుకూలంగా ఉన్న పిచ్లపై ఎలా బ్యాటింగ్ చేయాలనేది భారత్ను చూసి ఆసీస్ నేర్చుకోవాలి. ప్రత్యర్థి ఆటగాళ్లుగా మనం టీమిండియా బ్యాటింగ్ను చూడటానికి ఇష్టపడం. కానీ, క్లిష్టపరిస్థితుల్లో ఎలా ఆడాలనే దానికి ఉదాహరణగా టీమిండియా బ్యాటింగ్ను తీసుకోవాలి.
రెండో ఇన్నింగ్స్లో కనీసం మనం 200 పరుగులైనా చేసి ఉంటే భారత్పై ఆధిక్యం ప్రదర్శించేందుకు అవకాశం ఉండేది. కానీ, అలా జరగకుండా కేవలం 113 పరుగులకే ఆలౌటయ్యాం. తదుపరి మ్యాచుల్లోనైనా తప్పిదాల నుంచి గుణపాఠాలను నేర్చుకొని విజయాలబాట పట్టాలి.' అని మైకేల్ క్లార్క్ ఆకాంక్షించాడు.

బీసీసీఐ మోసం చేస్తుందని..
రెండో టెస్ట్ రెండో ఇన్నింగ్స్లో అశ్విన్, జడేజా బౌలింగ్లో స్వీప్ షాట్లు ఆడబోయి ఆరుగురు ఆసీస్ బ్యాటర్లను పెవిలియన్ చేరారు. 11 బంతుల వ్యవధిలో నాలుగు వికెట్లు కోల్పోయింది. 10 రోజుల ముందే భారత్కు వచ్చిన ఆసీస్ ఒక్క ప్రాక్టీస్ మ్యాచ్ ఆడలేదు. బీసీసీఐ సరైన స్పిన్ పిచ్ ఇవ్వదని, పేస్ పిచ్లను తయారు చేసి మోసం చేస్తుందని వామప్ మ్యాచ్లను బహిష్కరించింది.
గత పర్యటనలో ఇలానే చేసిందని ఈ సారి ప్రాక్టీస్ మ్యాచ్ ఆడలేదు. ఆసీస్ ఆటగాళ్లు సైతం ఈ నిర్ణయాన్ని సమర్థించుకున్నారు. ఇక భారత బౌలర్ల శైలిలో వేసే దేశవాళీ స్పిన్నర్లతో ప్రాక్టీస్ చేసిన ఆసీస్.. ఆశించిన ఫలితాన్ని అందుకోలేకపోయింది.


Click it and Unblock the Notifications












