న్యూఢిల్లీ: టీమిండియా స్టార్ క్రికెటర్ కేఎల్ రాహుల్ సోషల్ మీడియా వేదికగా సరదాగా షేర్ చేసిన ఓ ఫొటో ఇప్పుడు నెట్టింట హల్చల్ చేస్తుంది. ఈ ఫొటోపై మిస్ వరల్డ్ మానుషి చిల్లర్ స్పందించడంతో మరింత వైరల్ అయింది.
కరోనా నేపథ్యంలో ఇంటికే పరిమితమైన రాహుల్.. సోషల్ మీడియా వేదికగా కాలక్షేపం చేస్తూ.. నెత్తికి చేతి పెట్టుకొని సుదీర్ఘంగా ఆలోచిస్తున్న ఓ ఫొటోను ఇన్స్టాలో పంచుకున్నాడు. దీనికి మంచి క్యాప్షన్ కోసం ఆలోచిస్తున్నాని క్యాప్షన్గా పేర్కొన్నాడు. ఇక ఈ ఫొటోపై స్పందించిన అందాల తార మానుషి చిల్లర్.. మరో కర్ణాటక క్రికెటర్ సినన్ కదర్ను ట్యాగ్ చేస్తూ.. 'రాహుల్ అతన్ని అడుగు.. నీ పేజీ మొత్తం రాస్తాడని' కామెంట్ చేసింది. దీనికి స్పందించిన కదర్ 'హహహ...నీకు నచ్చిందా'అంటూ మానుషికి బదులిచ్చాడు. ప్రస్తుతం ఈ కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఇక కర్ణాటకు చెందిన సినన్ కదర్ గత సీజన్ రంజీ ట్రోఫీలో మిజోరం తరఫున బరిలోకి దిగాడు.
2017వ సంవత్సరంలో ప్రపంచ సుందరి కిరీటాన్ని కైవసం చేసుకున్న మానుషీ చిల్లర్.. గత కొద్దిరోజులుగా సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉంటుంది. ఇక మానుషి బాలీవుడ్ మూవీ 'పృథ్వీరాజ్'లో హీరో అక్షయ్ కుమార్ సరసన నటిస్తున్నారు.
ఇక కేఎల్ రాహుల్ ఈ ఏడాది ఆరంభంలో సూపర్ ఫామ్ కనబర్చిన విషయం తెలిసిందే. న్యూజిలాండ్ పర్యటలో పరిమిత ఓవర్ల ఫార్మాట్లో తనదైన బ్యాటింగ్తో అదరగొట్టారు. ఏ స్థానంలో బ్యాటింగ్కు పంపించినా అద్భుత ప్రదర్శన కనబర్చాడు. 5 టీ20ల్లో 224, మూడు వన్డేల్లో 204 పరుగులు చేశాడు. ఇక కీపర్గా కూడా రాణించాడు.
బర్త్డే బాయ్ మహేంద్ర సింగ్ ధోనీ టాప్-10 రికార్డ్స్