
పంత్ 6 నెలలు దూరం..
ఈ ప్రమాదంతో అతని కారు పూర్తిగా దగ్దమవ్వగా.. ఓ బస్సు డ్రైవర్ సాయంతో పంత్ ప్రాణాలతో బయటపడ్డాడు. డెహ్రాడూన్ మ్యాక్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న పంత్కు నుదిటిపై రెండు కాట్లు పడటంతో పాటు మొకాలి లింగ్మెంట్లో ఫ్రాక్టర్, మడమ, బొటన వేలికి గాయాలయ్యాయి. వీపు భాగంలో కూడా గాయాలయ్యాయి. దాంతో అతను సుమారు 6 నెలల పాటు ఆటకు దూరమయ్యే అవకాశాలున్నాయి. ఐపీఎల్ 2023 సీజన్తో పాటు ఆస్ట్రేలియాతో టెస్ట్ సిరీస్, న్యూజిలాండ్తో పరిమిత ఓవర్ల సిరీస్లకు పంత్ దూరం కానున్నాడు.

సంజూ, భరత్ కంటే..
వన్డే ప్రపంచకప్ టీమ్లో కీలకమైన రిషభ్ పంత్ ఇలా అనూహ్యంగా దూరమవడం టీమిండియా మేనేజ్మెంట్కు తలనొప్పిగా మారింది. పంత్ స్థానాన్ని ఎవరితో భర్తీ చేయాలి అనేదానిపై ఫోకస్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. పంత్కు ప్రత్యామ్నాయ ఆటగాళ్లుగా సంజూ శాంసన్, ఇషాన్ కిషన్, కేఎస్ భరత్ రేసులో ఉన్నారు. అయితే మణిందర్ సింగ్ మాత్రం మూడు ఫార్మాట్లలో ఇషాన్ కిషన్కే అవకాశం ఇవ్వాలన్నాడు. మైకేల్ చానెల్తో ఫోన్లో మాట్లాడిన మణిందర్ సింగ్.. పంత్ రిప్లేస్మెంట్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

ఇషాన్ కిషనే సరైనోడు...
'దురదృష్టవశాత్తు జరిగిన రోడ్డు ప్రమాదంతో రిషభ్ పంత్ జట్టుకు దూరమైతే టీమ్ మేనేజ్మెంట్ ఇషాన్ కిషన్ను ఎంపిక చేయాలి. లెఫ్టాండర్ అయిన ఇషాన్ కిషన్ మూడు ఫార్మాట్లలో పంత్ స్థానాన్ని భర్తీ చేయగలడు. అతను ఏస్థానంలోనైనా బ్యాటింగ్ చేయగలడు. నా వ్యక్తిగత అభిప్రాయం ప్రకారం నిర్భయంగా ఆడగలిగే ఆటగాళ్లకు తుది జట్టులో అవకాశం ఇవ్వాలి. ఇషాన్ కిషన్ తనకు వచ్చి అతి కొద్ది అవకాశాలను అద్భుతంగా అందిపుచ్చుకున్నాడు. బంగ్లాదేశ్తో వన్డేల్లో డబుల్ సెంచరీ బాదాడు.

ఆ సామర్థ్యం అతనిదే..
బ్యాటర్లు తడబడుతున్న వికెట్పై ఇషాన్ కిషన్ అసాధారణ బ్యాటింగ్తో చెలరేగాడు. దూకుడైన స్వభావం ఇషాన్ కిషన్కు మరిన్నీ అవకాశాలు రానున్నాయి. అసాధారణ ప్రతిభ కలిగిన ఆటగాళ్లను ఎంపిక చేయడం టీమ్మేనేజ్మెంట్, సెలెక్టర్ల బాధ్యత. అలాంటి సత్తా ఉన్న ప్లేయర్ ఇషాన్ కిషన్. అతనో బిగ్ మ్యాచ్ ప్లేయర్ అని నా గట్టి నమ్మకం. మూడు ఫార్మాట్లలో రిషభ్ పంత్ స్థానాన్ని భర్తీ చేసే సామర్థ్యం అతనికే ఉందనేది నా విశ్వాసం.'అని మణిందర్ సింగ్ చెప్పుకొచ్చాడు. 57 ఏళ్ల మనిందర్ సింగ్ భారత్ తరఫున 35 టెస్ట్లు, 59 వన్డేలు ఆడాడు.


Click it and Unblock the Notifications












