
పంకజ్ సింగ్ పాంచ్ పటాకా..
ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన వరల్డ్ జెయింట్స్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లకు 170 పరుగులు చేసింది. కెవిన్ ఓబ్రైన్(31 బంతుల్లో 9 ఫోర్లు, సిక్స్తో 52) హాఫ్ సెంచరీతో రాణించగా.. దినేశ్ రామ్దిన్(29 బంతుల్లో 5 ఫోర్లు, సిక్స్తో 42 నాటౌట్) ధాటిగా ఆడాడు.
ఇండియా మహరాజస్ బౌలర్లలో పంకజ్ సింగ్(5/26) ఐదు వికెట్ల ఘనతను అందుకోగా.. హర్భజన్ సింగ్, జోగిందర్ శర్మ, మహహ్మద్ కైఫ్ తలో వికెట్ తీసారు. శ్రీశాంత్ మూడు ఓవర్లు వేసి 46 పరుగులు సమర్పించుకున్నాడు. ముఖ్యంగా అతను వేసిన 19వ ఓవర్లో రామ్దిన్ ఐదు బౌండరీలతో 22 పరుగులు పిండుకున్నాడు.

దుమ్మురేపిన పఠాన్ బ్రదర్స్...
అనంతరం ఇండియా మహరాజస్ 18.4 ఓవర్లలో 4 వికెట్లకు 175 పరుగులు చేసి సునాయస విజయాన్నందుకుంది. టిమ్ బ్రెస్నన్ (3/21) ధాటికి ఇండియా 50 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి ఇబ్బందుల్లో పడింది. సెహ్వాగ్ (4), పార్థివ్ పటేల్ (18), మహమ్మద్ కైఫ్ (11) దారుణంగా విఫలమయ్యారు.
అయితే తన్మయ్ శ్రీవాస్తవ (39 బంతుల్లో 8 ఫోర్లు, సిక్సర్తో 54), యూసుఫ్ పఠాన్ ( 35 బంతుల్లో 5ఫోర్లు, 2 సిక్స్లతో 50 నాటౌట్), ఇర్ఫాన్ పఠాన్ ( 9 బంతుల్లో 3 సిక్స్లతో 20 నాటౌట్) చెలరేగారు. వరల్డ్ జెయింట్స్ బౌలర్లలో టిమ్ బ్రెస్నన్ ఒక్కడే మూడు వికెట్లు తీయగా.. ఫిడెల్ ఎడ్వార్డ్స్ ఓ వికెట్ పడగొట్టాడు.
ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ వేడుల్లో..
భారత్కు స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా కేంద్ర ప్రభుత్వం నిర్వహించిన ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ల్లో భాగంగా ఈ ప్రత్యేక మ్యాచ్కు బీసీసీఐ శ్రీకారం చుట్టింది. ఈ మ్యాచ్లో ఇండియా మహరాజాస్ జట్టుకు బీసీసీఐ ప్రెసిడెంట్ సౌరవ్ గంగూలీ నాయకత్వం వహిస్తాడని ప్రచారం జరిగినా.. అతను వ్యక్తిగత కారణాలతో తప్పుకున్నాడు. దాంతో హర్భజన్ సింగ్ టీమ్ను నడిపిస్తున్నాడు. ఈ చారిటీ మ్యాచ్ ద్వారా వచ్చే డబ్బులను దిగ్గజ కెప్టెన్ కపిల్ దేవ్కు చెందిన స్వచ్చంద సంస్థ ఖుషి ఫౌండేషన్కు అందజేయనున్నారు.

మహిళా అంపైర్లతో..
2003లో భారత మాజీ కెప్టెన్ కపిల్ దేవ్ ప్రారంభించిన స్వచ్చంద సంస్థ ఖుషి ఫౌండేషన్.. దేశంలోని చిన్నారులకు నాణ్యమైన విద్యను అందించేందుకు కృషి చేస్తోంది. ముఖ్యంగా పేద పిల్లలను స్కూళ్లకు పంపించడంలో ఖుషి ఫౌండేషన్ సక్సెస్ అయ్యింది. గత 17 ఏళ్లలో సుమారు 15 లక్షల పిల్లల జీవితాలను మార్చింది. మహిళల సాధికారత కోసం ఈ మ్యాచ్ నిర్వహిస్తున్న నేపథ్యంలో మహిళా అంపైర్లు అంపైరింగ్ చేస్తున్నారు. మ్యాచ్ రిఫరీతో పాటు అంపైర్లు, టీవీ అంపైర్లు కూడా మహిళలే కావడం విశేషం. భారత్లో ఓ పురుషుల క్రికెట్ మ్యాచ్కు మహిళా అంపైర్లు ఉండటం ఇదే తొలిసారి. లీగ్ మొత్తం మహిళలే అంపైరింగ్ చేయనున్నారు.


Click it and Unblock the Notifications












