
రూ.15 కోట్లు దండుగ..
అయితే జెమీసన్ ఆశించిన స్థాయిలో రాణించకపోవడంతో ఆర్సీబీ అతన్ని రిటైన్ చేసుకోలేదు. గత సీజన్లో మొత్తం 9 మ్యాచ్లు ఆడిన జేమీసన్ 28 ఓవర్లు వేసి భారీగా పరుగులు సమర్పించుకుని కేవలం 9 వికెట్లు మాత్రమే పడగొట్టాడు. కాగా, ఇటీవలి కాలంలో జేమీసన్ అద్భుతంగా రాణిస్తున్నప్పటికీ ఐపీఎల్ వేలంలో పాల్గొనకపోవడం అందర్నీ షాక్కు గురిచేసింది. 12 టెస్ట్ల్లోనే 62 వికెట్లు తీసిన జెమీసన్ సులువుగా రూ.10 కోట్లు పలికేవాడు. అయినా అతను కావాలనే దూరంగా ఉన్నాడు.

బయో బబుల్తో విసిగి..
తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఐపీఎల్కు దూరంగా ఉండటానికి గల కారణాన్ని జెమీసన్ వెల్లడించాడు. సుదీర్ఘ కాలం పాటు బయో బబుల్లో ఉండటం ఇష్టంలేక, కుటుంబంతో గడపాలనే ఉద్దేశంతో ఐపీఎల్కు దూరంగా ఉండాలని భావించినట్లు ఈ కివీస్ పేసర్ చెప్పుకొచ్చాడు. ‘ఐపీఎల్కు దూరంగా ఉండటానికి రెండు ప్రధాన కారణాలున్నాయి. అందులో మొదటిది ఏంటంటే గత ఏడాది కాలంగా బయోబబుల్ వాతావరణంతో విసిగిపోయాను. ఐసోలేషన్, క్వారంటైన్లో ఉంటూ మానసిక వ్యధను అనుభవించాను. మరో ఏడాది ఇలానే క్రికెట్ ఆడాలంటే నేను కనీసం ఓ 6-8 వారాలు ఇంట్లో వాళ్లతోనే గడపాలి. అప్పుడే నేను కొంచెం రిలాక్స్ అవుతాను.

ఆటపై ఫోకస్ పెట్టేందుకు..
ఇక రెండోది ఏంటంటే.. నా అంతర్జాతీయ కెరీర్ ఇంకా ఆరంభ దశలోనే ఉంది. నా కెరీర్ మొదలై రెండేళ్లే అవుతుంది. నా ఆటపై దృష్టిపెట్టాల్సిన అవసరం ఉంది. న్యూజిలాండ్ తరఫున మూడు ఫార్మాట్లు ఆడుతున్న నేపథ్యంలో ఆటగాడిగా నేను మరింత మెరుగ్వాలి. అందుకే ఆటపై ఫోకస్ పెట్టి, మరింత సమయం వెచ్చించాలనుకుంటున్నా. ఆ క్రమంలోనే కొంతకాలం ఇంట్లోనే హాయిగా ఉండాలనుకుంటున్నా'అని జెమీసన్ చెప్పుకొచ్చాడు.


Click it and Unblock the Notifications












