
వెంటనే జింబాబ్వే టూర్..
జూలై 29 నుంచి టీ20 సిరీస్ ప్రారంభం కానుంది. ఇక వెస్టిండీస్ పర్యటన ముగిసిన వెంటనే భారత జట్టు.. జింబాబ్వే పర్యటనకు వెళ్లనుంది. ఈ టూర్లో భాగంగా టీమిండియా మూడు వన్డేలు ఆడనుంది. హరారే వేదికగా ఆగస్ట్ 18న జరగనున్న తొలి వన్డేతో ఈ సిరీస్ ప్రారంభం కానుంది. అయితే ఆగస్ట్ 27 నుంచి ఆసియా కప్ ప్రారంభం కానుండటంతో జింబాబ్వే టూర్కు కూడా బీసీసీఐ ద్వితీయ శ్రేణి జట్టును పంపించనుంది. ఆసియా కప్ దృష్ట్యా ఈ సిరీస్కు కెప్టెన్ రోహిత్ శర్మతో పాటు సీనియర్ ఆటగాళ్లందరికి విశ్రాంతి ఇచ్చే ఆలోచనలో బీసీసీఐ ఉంది.

కెప్టెన్గా కేఎల్ రాహుల్..
ఈ క్రమంలో జింబాబ్వే సిరీస్కు భారత జట్టు కెప్టెన్గా కేఎల్ రాహుల్ వ్యవహరించనున్నాడు. ప్రస్తుతం టీమిండియా వైస్ కెప్టెన్ అయిన రాహుల్ హెర్నీయా సర్జరీ నేపథ్యంలో ఇంగ్లండ్ పర్యటనకు దూరంగా ఉన్నాడు. వెస్టిండీస్తో టీ20 సిరీస్కు తిరిగి జట్టులో చోటు దక్కించుకున్న రాహుల్.. ప్రస్తుతం బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీలో శిక్షణ పొందుతున్నాడు. విండీస్ టీ20 సిరీస్కు ముందు రాహుల్కు ఫిట్నెస్ పరీక్ష నిర్వహించనున్నారు. ఈ టెస్ట్లో పాసైతేనే రాహుల్ విండీస్ ఫ్లైట్ ఎక్కనున్నాడు. ఒకవేళ విఫలమైనా.. జింబాబ్వే పర్యటనలోపు అతను ఫిట్ కానున్నాడు.

ఫామ్ తెచ్చిన తంటాలు..
పేలవ ఫామ్ నేపథ్యంలో టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ సైతం జింబాబ్వే పర్యటనకు వెళ్లే అవకాశం ఉంది. కోహ్లీని ఫామ్లోకి తీసుకొచ్చేందుకు బీసీసీఐ మాస్టర్ ప్లాన్ రెడీ చేస్తోంది. జింబాబ్వే పర్యటనలో విరాట్ను ఆడిస్తే అతను గాడిన పడుతాడని సెలెక్టర్లు భావిస్తున్నారు. ప్రస్తుతం విరాట్ కోహ్లీ తీసుకున్న బ్రేక్తో అతనికి మానసిక ప్రశాంతత లభిస్తుందని ఆశిస్తున్నా. మళ్లీ ఫామ్లోకి రావడానికి ఈ బ్రేక్ ఉపయోగపడుతుందనుకుంటున్నా. అయితే ఎలాంటి కాంపిటేటివ్ క్రికెట్ ఆడకుండా పెద్ద టోర్నీలు ఆడటం కష్టం అవుతుంది. అందుకే మేం అతన్ని జింబాబ్వే పర్యటనకు పంపించాలనుకుంటున్నాం.
అది అతనికి అనుగైన ఫార్మాట్. ఆసియా కప్ ముందు మళ్లీ ఫామ్ అందుకనేందుకు కోహ్లీకి జింబాబ్వే పర్యటన ఉపయోగపడుతుంది. త్వరలోనే దీనిపై తుది నిర్ణయం తీసుకుంటాం.'అని సదరు సెలెక్షన్ కమిటీ మెంబర్ తెలిపాడు.


Click it and Unblock the Notifications
