పాజిటీవ్గానే ఉన్నాం..
‘వరుసగా రెండు మ్యాచ్ల్లో ఓడి సిరీస్ చేజారినా.. మా ఆలోచనా విధానం ఇంకా పాజిటీవ్గానే ఉంది. ప్రత్యర్థి జట్టు మాకంటే బాగా ఆడిందనే విషయాన్ని కొన్నిసార్లు అంగీకరించాలి. వారికిది స్వదేశీ సిరీస్ కావడంతో బాగా ఆడారు. వన్డే సిరీస్ కోల్పోయినా ఇది లాంగ్ టూర్ కావడంతో ఇంకా ఆడాల్సింది చాలా ఉంది. ఇలాంటి బ్యాటింగ్ వికెట్లపై సరైన బౌలింగ్ చేయడమే మేమిప్పుడు చేయాల్సి ఉంది. అదే పెద్ద సవాలు. అందుకోసం మా బౌలర్లు కష్టపడుతున్నారు. అయితే, మా ఆటగాళ్లు కొన్ని తప్పులు చేశారు. వాటిని సరిచేసుకోవాల్సిన అవసరం ఉంది' అని టీమిండియా బ్యాట్స్మన్ వివరించాడు.
బుమ్రా చెలరేగుతాడు..
అనంతరం బుమ్రా బౌలింగ్పై స్పందిస్తూ.. అతను ఎలాంటి బౌలరో అందరికీ తెలుసని, కచ్చితంగా వికెట్లు తీసి మళ్లీ ఆకట్టుకుంటాడని ఆశాభావం వ్యక్తం చేశాడు. ఇక న్యూజిలాండ్, ఆస్ట్రేలియా లాంటి పిచ్లు బ్యాటింగ్కు అనుకూలంగా ఉంటాయని, అక్కడ మేటి బౌలర్లు సైతం వికెట్లు తీయలేరనే విషయాన్ని అర్థం చేసుకోవాలని చెప్పాడు. ఇక తన బ్యాటింగ్ విషయంలో డాట్బాల్స్ ఆడటం తక్కువ చేసుకోవాలనుకుంటున్నట్లు రాహుల్ పేర్కొన్నాడు.
చెత్త పెర్ఫామెన్స్..
ఎన్నో అంచనాల మధ్య ఆసీస్ గడ్డపై అడుగుపెట్టిన భారత జట్టు పేలవ ఆటతీరుతో వరుసగా ఓటమిలైంది. ఫస్ట్ వన్డేలో 66, రెండో వన్డేలో 51 పరుగులతో చిత్తయింది. దాంతో మూడు వన్డేల సిరీస్ను 0-2తో మరో మ్యాచ్ మిగిలుండగానే కోల్పోయింది. నామమాత్రపు మూడో వన్డే బుధవారం జరగనుంది. ఈ మ్యాచ్లోనైనా గెలిచి పరువు నిలుపుకోవాలని కోహ్లీసేన భావిస్తోంది. ఈ రెండు వన్డేల్లో భారత బౌలర్లు పూర్తిగా తేలిపోయారు. పోటీపడి మరీ పరుగులు సమర్పించుకున్నారు.