ఇండియన్స్ను ఎగతాళి చేస్తూ
ఒలీ రాబిన్సన్ పాత ట్వీట్లపై విచారణ కొనసాగుతుండటం.. మరోవైపు జాత్యాహంకార వ్యాఖ్యల్ని అస్సలు సహించబోమని ఈసీబీ వార్నింగ్ ఇవ్వడంతో మిగిలిన ఇంగ్లండ్ క్రికెటర్లు భయాందోళనలో ఉన్నారు. దీంతో తమ పాత ట్వీట్లను తొలగించారు. ఇంగ్లండ్ పరిమిత ఓవర్ల కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ 'సర్' అనే పదాన్ని వినియోగిస్తూ అప్పట్లో ఇండియన్స్ను ఎగతాళి చేస్తూ చేసిన ట్వీట్లను తాజాగా డిలీట్ చేశాడు. జోస్ బట్లర్ 'సర్' అంటూ పరోక్షంగా భారతీయులను ఎగతాళి చేస్తూ మూడేళ్ల క్రితం పెట్టిన ట్వీట్లను డిలీట్ చేశాడు.
వారిపై తగిన చర్యలు తీసుకుంటాం
బ్రెండన్ మెక్కలమ్ కూడా గతంలో ఇలాంటి ట్వీట్లే చేశాడు. దాంతో ఇంగ్లండ్ ఆటగాళ్లపై కఠిన చర్యలు తీసుకోవాలన్న డిమాండ్లు మొదలయ్యాయి. 'ఆటగాళ్ల విద్వేషపూరితమైన ట్వీట్లపై గతవారం మేం దృష్టి సారించాం. వారు గతంలో పోస్టు చేసిన వివక్షతతో కూడిన సామాజిక మాధ్యమాల పోస్టులపై ప్రశ్నలు రేకెత్తుతున్నాయి. మా ఆటలో వివక్షకు తావులేదు. అవసరమైన వారిపై తగిన చర్యలు తీసుకుంటాం. నిజానిజాలు తెలుసుకుని వ్యవహరిస్తాం' అని ఓ ఈసీబీ ప్రతినిధి ఒకరు వెల్లడించారు.
విశ్వనాథన్ ఆనంద్తో చెస్ ఆడనున్న బాలీవుడ్ స్టార్ హీరో!!
కేకేఆర్ జాతి వివక్షను అస్సలు సహించబోదు
గతంలో కేకేఆర్ ఆటగాళ్లు చేసిన ట్వీట్లపై తమకు పూర్తి సమాచారం తెలియదని ఆ జట్టు సీఈఓ వెంకీ మైసూర్ అన్నారు. 'ఈ వ్యవహారంపై మాకింకా పూర్తి వివరాలు అందలేదు. ఏం జరిగిందో తెలియకుండా స్పందించడం సరికాదు. నిజానిజాలు తెలిసిన తర్వాతే నిర్ణయం తీసుకుంటాం. ఏదేమైనా కేకేఆర్ జాతి వివక్షను అస్సలు సహించబోదని స్పష్టం చేస్తున్నా. వివక్షతతో కూడిన వ్యాఖ్యలు చేసుంటే చర్యలు తీసుకుంటాం' అని వెంకీ తెలిపారు.
స్క్రీన్ షాట్ వైరల్
ఐపీఎల్లో కోల్కతా కెప్టెన్గా ఉన్న ఇయాన్ మోర్గాన్, రాజస్థాన్ రాయల్స్ వికెట్ కీపర్ జోస్ బట్లర్ గతంలో ఇండియన్స్ను వెక్కిరిస్తూ పలు ట్వీట్లను తొలగించినా.. వాటికి సంబంధించిన స్క్రీన్ షాట్ బయటకు వచ్చాయి. 2018 ఐపీఎల్ సందర్భంగా వీళ్లు ఈ ట్వీట్లు చేశారని సమాచారం. విచారణ పూర్తయిన తర్వాత ఈ ఇద్దరిపై చర్యలు తీసుకోవాలో వద్దో నిర్ణయిస్తామని ఈసీబీ చెప్పినట్లు ఓ జాతీయ మీడియా వెల్లడించింది. జేమ్స్ అండర్సన్పైనా విచారణ జరిగే అవకాశం ఉంది.