
హార్డ్ హిట్టర్ కోసం..
ఓ యూట్యూబ్ చానెల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో కిరణ్ మోరే.. ధోనీకి సంబంధించిన ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు. 2003 వన్డే ప్రపంచకప్ అనంతరం భారత జట్టులోకి ఓ వికెట్ కీపర్ కమ్ బ్యాట్స్మన్ తీసుకోవాలనుకున్నామని తెలిపాడు. అప్పటి కీపర్ రాహుల్ ద్రవిడ్పై ఒత్తిడి తగ్గించడంతో పాటు మంచి ఫినిషర్ అయి ఉండాలని భావించామని తెలిపాడు. 'మేం వికెట్ కీపర్ కమ్ బ్యాట్స్మన్ను తీసుకోవాలనుకున్నాం. ఆ టైమ్లో ఫార్మాట్లో కూడా మార్పులు చోటు చేసుకోవడంతో 6, 7 స్థానాల్లో బ్యాటింగ్ వచ్చి వేగంగా 40-50 పరుగులు చేసే పవర్ హిట్టర్ కావాలనుకున్నాం. రాహుల్ ద్రవిడ్ అప్పటికే 75 మ్యాచ్లు కీపింగ్ చేశాడు. 2003 ప్రపంచకప్లోనూ ఆడాడు. అతనిపై ఒత్తిడి తగ్గించాలనుకున్నాం.'అని తెలిపాడు.

దేశవాళీ మ్యాచ్లో..
అయితే ఓ దేశవాళీ మ్యాచ్ సందర్భంగా ధోనీని తొలిసారి చూశానన్న కిరణ్ మోరే.. అతన్ని దులీప్ ట్రోఫీ ఫైనల్లో ఈస్ట్ జోన్ తరఫున కీపింగ్ చేయించేందుకు సౌరవ్ గంగూలీని ఒప్పించడానికి 10 రోజులు పట్టిందన్నాడు. అప్పటికే ఆ జట్టు తరఫున దీప్ దాస్ గుప్తా కీపింగ్ చేస్తున్నాడని, ఫైనల్ మ్యాచ్లో తనకు ధోనీతో కీపింగ్ చేయించాలనిపించదన్నాడు. దీనికి ముందు గంగూలీ ససేమిరా అన్నాడని, చివరకు ఒప్పుకోవడం ధోనీ ఆకట్టుకోవడం జరిగిపోయిందన్నాడు.

ఒప్పించడానికి 10 రోజులు..
'ధోనీని ముందుగా నా సహోద్యోగి చూసి నాకు చెప్పాడు. నేను చూసిన మ్యాచ్లో ధోనీ అద్భుతంగా ఆడాడు. ప్రతీ బౌలర్పై విరుచుకుపడ్డాడు. జట్టు స్కోర్ 170 అయితే అతనొక్కడే 130 పరుగులు చేశాడు. అది నన్ను విపరీతంగా ఆకట్టుకుంది. అతన్ని మేం దులీప్ ట్రోఫీ ఫైనల్లో వికెట్ కీపర్గా ఆడించాలనుకున్నాం. దాని కోసం గంగూలీ, దీప్దాస్ గుప్తాతో సుదీర్ఘంగా చర్చించాం. ఆ సమయంలో వారు కోల్కతాతో పాటు భారత్కు ఆడుతున్నారు. ఈస్ట్ జోన్ తరఫున ధోనీని ఆడించేందుకు గంగూలీని ఒప్పించేందుకు 10 రోజులు పట్టింది.'అని మోరె చెప్పుకొచ్చాడు. 2004లో బంగ్లాదేశ్పై అరంగేట్రం చేసిన ధోనీ.. విశాఖ వేదికగా పాకిస్థాన్తో జరిగిన మ్యాచ్లో పరుగుల విధ్వంసం సృష్టించి అందరి దృష్టి ఆకర్షించాడు. అప్పటి నుంచి అతని పేరు మోరుమోగిపోయింది.


Click it and Unblock the Notifications
