For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

విరాట్ కోహ్లీ కెప్టెన్సీని భర్తీ చేసేది అతనే: మాజీ సెలెక్టర్

Kiran More feels Rishabh Pant can replace Virat Kohli as Team India captain
Rishabh Pant కు పెరిగిపోతున్న డిమాండ్ | Team India Captain | kohli | Rohit Sharma || Oneindia Telugu

న్యూఢిల్లీ: టీమిండియా వికెట్ కీపర్ కమ్ బ్యాట్స్‌మన్ రిషభ్ పంత్‌పై భారత మాజీ చీఫ్ సెలెక్టర్ కిరణ్ మోరే ప్రశంసల జల్లు కురిపించాడు. టీమిండియా భవిష్యత్తు కెప్టెన్ పంతేనని అభిప్రాయడ్డాడు. జట్టును నడిపించగల నైపుణ్యాలు, సరైన మనస్థత్వం అతని సొంతమని తెలిపాడు. ఐపీఎల్​లో ఢిల్లీ క్యాపిటల్స్​కు సారథ్యం వహించిన అనుభవం అతనికి పనికొస్తుందని పేర్కొన్నాడు. తాజాగా ఇండియా టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ధోనీ వారసత్వాన్ని కోహ్లీ అందిపుచ్చుకుంటే.. అతని స్థానాన్ని పంత్ భర్తీ చేయనున్నాడని తెలిపాడు.

ఫ్యూచర్ కెప్టెన్..

ఫ్యూచర్ కెప్టెన్..

'రిషభ్ పంత్.. భవిష్యత్​లో టీమిండియా కెప్టెన్​గా వ్యవహరించే అవకాశాలు మెండుగా ఉన్నాయి. కెప్టెన్‌కు ఉండాల్సిన అన్ని లక్షణాలు పంత్​కు ఉన్నాయి. అతని కెరీర్​ను ఓసారి పరిశీలిస్తే ప్రారంభంలో చాలా ఒడిదొడుకులు కనిపిస్తాయి. మొదట్లో అతను ఎదుర్కొన్న గడ్డు పరిస్థితుల వల్లే అతను మానసికంగా దృఢంగా తయారయ్యాడు. తొలుత ప్రపంచకప్​కు ఎంపిక కాలేదు. టీ20లతో పాటు వన్డేలకూ జట్టులోకి తీసుకోలేదు. కానీ, అతను అనూహ్యంగా టెస్టు ఫార్మాట్​ ద్వారా జట్టు​లోకి వచ్చాడు. స్థాయికి తగ్గ ప్రదర్శనతో జట్టులో స్థానం సుస్థిరం చేసుకున్నాడు.'అని ​కిరణ్ మోరే చెప్పుకొచ్చాడు.

ఆసీస్ గడ్డపై అదరగొట్టి..

ఆసీస్ గడ్డపై అదరగొట్టి..

పాకిస్థాన్ వెటరన్ బ్యాట్స్‌మన్ సల్మాన్ బట్‌ సైతం టీమిండియా ఫ్యూచర్ కెప్టెన్ పంతేనని తెలిపాడు. ఇటీవల ఆసీస్​తో జరిగిన టెస్టు సిరీస్​లో పంత్ అత్యుత్తమ ప్రదర్శన కనబర్చిన విషయం తెలిసిందే. ఆస్ట్రేలియాతో జరిగిన మూడు టెస్టుల్లో 274 పరుగులు చేసిన ఈ వికెట్ కీపర్.. జట్టుకు కీలకమైన సమయాల్లో రాణించాడు.

అదే విధంగా స్వదేశంలో ఇంగ్లండ్​తో జరిగిన సిరీస్​లోనూ 270 పరుగులు చేసి జట్టుకు తానెంత ముఖ్యమైన ఆటగాడనేది నిరూపించాడు. శ్రేయస్ అయ్యర్ గైర్హాజరీలో ఢిల్లీ క్యాపిటల్స్ సారథ్య బాధ్యతలు అందుకున్న పంత్.. జట్టును అద్భుతంగా నడిపించి పాయిట్స్ టేబుల్‌ల్లో మెరుగైన స్థానంలో నిలబెట్టాడు.

రోహిత్‌ శర్మ కూడా..

రోహిత్‌ శర్మ కూడా..

టీమిండియా స్టార్ ఓపెనర్ రోహిత్ శర్మను పరిమిత ఓవర్ల ఫార్మాట్‌కు కెప్టెన్‌గా నియమించాలని వస్తోన్న వాదనలకు కిరణ్ మోరె మద్దతు తెలిపిన విషయం తెలిసిందే. ప్రస్తుత టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీనే ఏదో ఒక రోజు తన సారథ్య బాధ్యతలను రోహిత్‌తో పంచుకోవడానికి ముందుకు వస్తాడని కూడా ఈ మాజీ చీఫ్ సెలెక్టర్ జోస్యం చెప్పాడు.

' రోహిత్​ శర్మకు త్వరలోనే భారత జట్టుకు సారథ్యం వహించే అవకాశం వస్తుందనుకుంటున్నా. ధోనీ ఆధ్వర్యంలో కోహ్లీ తెలివిగల సారథిగా వృద్ధి చెందాడు. ఎంతకాలం వన్డేలు, టీ20లకు కెప్టెన్​గా ఉండాలని అనుకుంటాడు? అతడు కూడా ఈ విషయమై ఆలోచిస్తాడు. ఇంగ్లండ్​ పర్యటన తర్వాత దీనిపై స్పష్టత వస్తుంది. కోహ్లీ.. కెప్టెన్సీ బాధ్యతల్ని రోహిత్​తో పంచుకుంటే భవిష్యత్ తరాలకు ఓ బలమైన సందేశాన్ని ఇచ్చినట్లవుతుంది. భారత్​లో ఒక్కో ఫార్మాట్​కు ఒక్కో కెప్టెన్​ అనే పంథా సెట్​ అవుతుంది.'అని కిరణ్ మోరె తెలిపాడు.

Story first published: Friday, May 28, 2021, 18:30 [IST]
Other articles published on May 28, 2021
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+