
అనవసర చర్చ..
భవిష్యుత్తు టీమిండియా హెడ్ కోచ్గా రాహుల్ ద్రవిడ్ను సిద్దం చేయాలనుకోవడం మంచి ఆలోచనన్న కపిల్.. అత్యవసరంగా రవిశాస్త్రిని తప్పించాల్సిన అవసరం కూడా లేదన్నాడు. రవిశాస్త్రి మేనేజ్మెంట్ స్కిల్స్తోనే టీమిండియా.. ఆస్ట్రేలియాను వారి సొంతగడ్డపై ఓడించిందని, 2019 వరల్డ్ కప్ సెమీఫైనల్, డబ్ల్యూటీసీ ఫైనల్ వరకు వెళ్లిందన్నాడు.
'మీరు కొత్త కోచ్ను సిద్దం చేయాలనుకోవడంలో తప్పులేదు. అయితే రవిశాస్త్రి కోచ్గా పనిచేస్తున్నప్పుడు మాత్రం అతన్ని తప్పించాల్సిన అవసరమైతే లేదు. అయితే దీన్ని కాలమే నిర్ణయించాలి. ఇలాంటి చర్చలు, వార్తల వల్ల కోచ్లు, ప్లేయర్లపై అనవసర ఒత్తిడి పెరుగుతుంది' అని కపిల్ పేర్కొన్నారు.

సమస్యేం లేదు..
ఒకే సమయంలో రెండు భారత జట్లను అంతర్జాతీయ సిరీస్లు ఆడించడం వల్ల వచ్చే సమస్యేం లేదని కపిల్ దేవ్ అన్నాడు. యువ ఆటగాళ్లకు అవకాశం దక్కుతుందని తెలిపాడు. దేశం తరఫున ఆడాలనే కోరికతో పాటు సత్తా చాటేందుకు మంచి వేదిక దొరుకుతుందన్నాడు. అయితే ఈ రోజుల్లో ఎక్కువ క్రికెట్ ఆడుతున్నందున జట్లపై ఒత్తిడి పడకుండా చూసుకోవాలని కపిల్ పేర్కొన్నాడు.
'భారత్కు బలమైన రిజర్వ్ బెంచ్ ఉంది. ఒకే సమయంలో రెండు భారత జట్లు విజయం సాధిస్తే అంతకన్నా మంచి విషయం మరొకటి ఉండదు. అయితే ఒకేసారి ఇరు జట్లను ఒత్తిడికి గురి చేయడం అవసరమా? లేదా? అన్నది టీమ్ మేనేజ్మెంట్ నిర్ణయించుకోవాలి'అని కపిల్ చెప్పుకొచ్చాడు.

వారిని అవమానించినట్లే..
ఇంగ్లండ్ పర్యటనలో గాయపడ్డ శుభ్మన్గిల్ స్థానంలో అక్కడే ఉన్న మయాంక్ అగర్వాల్, కేఎల్ రాహుల్, అభిమన్యు ఈశ్వరన్లను తీసుకోకుండా.. శ్రీలంక పర్యటనలో ఉన్న పృథ్వీ షా పిలిపిస్తే అక్కడున్న ప్లేయర్లను అవమానపరిచినట్లేనని కపిల్ దేవ్ చెప్పుకొచ్చాడు. 'ఇప్పుడు కొత్తగా జట్టులోకి ఎవరినీ పంపాల్సిన అవసరం లేదు. ఈ విషయంలో బీసీసీఐ సెలెక్టర్లు కూడా కాస్త బాధ్యతగా ఉండాలి. వాళ్లొక జట్టును ఎంపిక చేశారు. అప్పుడు కెప్టెన్, కోచ్లను సంప్రదించకుండా చేయరనే అనుకుంటున్నా' అని కపిల్ అన్నారు.


Click it and Unblock the Notifications












