
ఐపీఎల్ ఆడకండి..
‘తీరిక లేని షెడ్యూల్తో అలసిపోతున్నామని భావిస్తే ఐపీఎల్ ఆడొద్దు' అని ఓ ప్రైవేట్ కార్యక్రమంలో పాల్గొన్న కపిల్ సూచించాడు.‘దేశానికి ప్రాతినిధ్యం వహిస్తున్నప్పుడు తప్పుకోవాలంటే ఇబ్బంది కానీ.. ఐపీఎల్ ఆడకపోవడం పెద్ద సమస్యే కాదు. ఐపీఎల్లో దేశం తరపున ఏం ప్రాతినిధ్యం వహించడం లేదు కదా. అలసిపోతున్నామనుకుంటే ఐపీఎల్ జరుగుతున్న సమయంలో విశ్రాంతి తీసుకొండి. దేశానికి ప్రాతినిథ్యం వహిస్తున్నవారిలో అంకితభావానికి లోటు ఉండకూడదు.'అని చెప్పుకొచ్చాడు.

నాకు తెలియదు..
ప్రస్తుత భారత జట్టులో ఎవరైనా బీజీ షెడ్యూల్ వల్ల, ఇబ్బందులకు గురైనట్లు అనిపించిందా?అన్న ప్రశ్నకు సమాధానం చెప్పడానికి కపిల్ నిరాకరించాడు. ‘నాకు తెలియదు. టీవీలో వారి ఆటను చూస్తూ దీనిపై కామెంట్ చేయడం సమంజసం కాదు'అని ఈ వరల్డ్కప్ విన్నింగ్ కెప్టెన్ బదులిచ్చాడు.

అది భావోద్వేగాలపై..
అలసిపోవడమనేది శారీరకంగా ఉన్న మానసిక భావోద్వేగ స్థితన్నారు.‘ఒక మ్యాచ్లో వికెట్లు తీసినా.. లేదా పరుగుల చేసినా.. అలసట అన్పించదు. అదే ధారళంగా పరుగులు సమర్పించుకున్నా.. త్వరగా ఔటైనా.. అలసిపోయామనే భావన వస్తుంది. ఇదంతా భావోద్వేగాలపై ఆధారపడి ఉంటుంది' కపిల్ చెప్పుకొచ్చాడు.

బిజీ షెడ్యూల్పై..
సుదీర్ఘ పర్యటన కోసం న్యూజిలాండ్ చేరుకున్న తర్వాత కోహ్లీ టైట్ షెడ్యూల్పై అసహనం వ్యక్తం చేశాడు. 'ఇటీవలి కాలంలో చాలా క్రికెట్ ఆడాం. సిరీస్-సిరీస్కు మధ్య సమయం కుదించుకుపోతుంది. ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్ ఆడాం. అప్పుడు మైదానంలో ఎక్కువ సమయం గడిసాం. అంతకన్నా ముందు శ్రీలంకతో టీ20 సిరీస్ ఆడాం. భారత్ కన్నా ఏడు గంటల ముందు నడుస్తున్న న్యూజిలాండ్కు వచ్చి ఇంత త్వరగా సర్దుకోవడం చాలా కష్టం. టోర్నీ నిర్వాహకులు ఇలాంటి విషయాలపై భవిష్యత్లో దృష్టిసారిస్తారని ఆశిస్తున్నా' అని అప్పట్లో వ్యాఖ్యానించాడు.


Click it and Unblock the Notifications

