
చెంపదెబ్బ కొట్టాలనుంది..
ఈ నేపథ్యంలోనే రిషభ్ పంత్ గురించి కపిల్ దేవ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. పంత్ పూర్తిగా కోలుకున్న తర్వాత మళ్లీ ఇలాంటి తప్పిదాలు చేయవద్దని చెంపదెబ్బ కొడతానన్నాడు. 'రిషభ్ పంత్ అంటే నాకు ఎంతో ఇష్టం. అతను కోలుకున్న తర్వాత ఇంటికి వెళ్లి చెంప దెబ్బ కొట్టాలనుంది. పంత్ లేకపోవడంతో టీమిండియాలో గందరగోళం నెలకొంది. అందుకే జాగ్రత్తగా ఉండాలని మందలిస్తా. రిషభ్ పంత్ను ఎంతో ప్రేమిస్తా. కానీ ఇప్పుడు అతనిపై నాకు పీకల దాకా కోపం ఉంది.

ఈ కాలం కుర్రాళ్లే ఇంత..
ఈ కాలం కుర్రాళ్లు ఇలాంటి పిచ్చి పనులు చేసి ఎందుకు కెరీర్ నాశనం చేసుకుంటారో అర్థం కాదు. అతను ఒక్కడు జట్టులో ఉండి ఉంటే బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో ఆస్ట్రేలియాకు గట్టి సమాధానం చెప్పేవాడు. రిషభ్ పంత్ని ప్రపంచమంతా ప్రేమిస్తోంది. అతను త్వరగా కోలుకుని, క్రికెట్ ఆడాలని ఆకాంక్షిస్తోంది. ఇంతమంది ప్రేమను పొందడం ఎంతో అదృష్టం. పిల్లలు తప్పుచేస్తే కొట్టి సరిదిద్దాల్సిన బాధ్యత తల్లిదండ్రులకు ఉంటుంది'అని కపిల్ దేవ్ చెప్పుకొచ్చాడు.

కేఎస్ భరత్కు చాన్స్..
రిషభ్ పంత్ లేకుండానే టీమిండియా బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ ఆడనుంది. రిషభ్ పంత్ స్థానంలో యువ వికెట్ కీపర్లు ఇషాన్ కిషన్, కేఎస్ భరత్లను జట్టులోకి తీసుకుంది. అయితే ఏ మాత్రం అంతర్జాతీయ అనుభవం లేని ఈ ఇద్దరు వికెట్ కీపర్లు పంత్ లేని లోటును తీర్చుతారా? అనేది సందేహంగా మారింది. దేశవాళీ క్రికెట్తో పాటు భరత్ ఏ తరఫున ఆడిన అనుభవం కేఎస్ భరత్కు ఉండగా.. ఇషాన్ కిషన్ ఇప్పటి వరకు పెద్దగా రెడ్ బాల్ క్రికెట్ ఆడలేదు. ఈ క్రమంలో కేఎస్ భరత్ తుది జట్టులో అవకాశం దక్కించుకోనున్నాడు. అయితే పంత్లా పవర్ హిట్టింగ్ చేయగలడా? అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.


Click it and Unblock the Notifications












