కరాచీ: పది జట్లతో వస్తున్న ఐపీఎల్ 2022 సీజన్ కోసం అభిమానులంతా ఆత్రుతగా ఎదురుచూస్తున్న వేళ టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ అనూహ్య నిర్ణయంతో అందరికి షాకిచ్చాడు. లీగ్ ప్రారంభానికి రెండు రోజుల ముందు చెన్నై సూపర్ కింగ్స్ సారథ్య బాధ్యతల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించాడు. టీమ్లో తనకెంతో నమ్మకస్తుడైన రవీంద్ర జడేజాకు కెప్టెన్సీ అప్పగించాడు. ఇక కెప్టెన్గా అంత అనుభవం లేని జడేజా జట్టును ఎలా నడిపిస్తాడనేదానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఇక కెప్టెన్గా బాధ్యతలు స్వీకరించబోతున్న జడేజాకు సంబంధించిన ఓ ఆసక్తికర ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది.
గ్రౌండ్లో చాలా చురుగ్గా ఉండే జడేజా.. ఐపీఎల్ ఆరంభంలో మైదానం వెలుపల తన బద్ధకంతో టీమ్ కెప్టెన్కి కోపం తెప్పించేవాడట. రాజస్థాన్ రాయల్స్ జట్టుకు ఆడే సమయంలో క్రమశిక్షణ తప్పిన రవీంద్ర జడేజాకి అప్పటి రాజస్థాన్ టీమ్ కెప్టెన్ షేన్ వార్న్ శిక్ష కూడా విధించినట్లు పాకిస్థాన్ మాజీ వికెట్ కీపర్ కమ్రాన్ అక్మల్ గుర్తు చేసుకున్నాడు. ఐపీఎల్ 2008 సీజన్ టైటిల్ విజేతగా రాజస్థాన్ రాయల్స్ టీమ్ నిలవగా.. ఆ జట్టులో కమ్రాన్ అక్మల్ కూడా ఉన్నాడు.
రవీంద్ర జడేజాకి రాజస్థాన్ కెప్టెన్ షేన్ వార్న్ శిక్ష విధించడాన్ని తాజాగా అక్మల్ గుర్తు చేసుకున్నాడు.'ఒకసారి రవీంద్ర జడేజా, యూసఫ్ పఠాన్ ప్రాక్టీస్ సెషన్కు కాస్త ఆలస్యంగా వచ్చారు. అప్పుడు కెప్టెన్ షేన్ వార్న్ వారిని ఏమీ అనలేదు. ప్రాక్టీస్ ముగిసిన తర్వాత జట్టు మొత్తం స్టేడియం నుంచి హోటల్కి బస్లో వెళ్తుండగా.. డ్రైవర్ను బస్ ఆపాల్సిందిగా కోరిన షేన్వార్న్.. జడేజా, పఠాన్లను బస్ నుంచి దిగిపోవాలని ఆదేశించాడు. ఇక్కడి నుంచి నడుచుకుంటూ రండి అని చెప్పాడు. అక్కడి నుంచి హోటల్కు2 కిలోమీటర్ల దూరం ఉంటుంది. అయితే ఆరోజు నేను కూడా కాస్త లేట్గా ప్రాక్టీస్కు వెళ్లాను. అతను నన్ను కూడా ఏమీ అనలేదు. దానికి కారణం నేను ఆలస్యంగా జట్టుతో చేరడమే'' అని అక్మల్ గుర్తు చేసుకున్నాడు.
ఇక థాయ్లాండ్కు వెకేషన్కు వెళ్లిన షేన్ వార్న్ గుండెపోటుతో మరణించిన విషయం తెలిసిందే. టెస్టుల్లో 708 వికెట్లు తీసిన వార్న్ అత్యధిక వికెట్లు తీసిన జాబితాలో రెండో స్థానంలో ఉన్నాడు. శ్రీలంక దిగ్గజ స్పిన్నర్ ముత్తయ్య మురళీధరన్ 800 వికెట్లతో అగ్రస్థానంలో ఉన్నాడు. 5 టెస్టు మ్యాచ్ల్లో 708 వికెట్లు తీసిన వార్న్, 194 వన్డే మ్యాచ్ల్లో 293 వికెట్లు పడగొట్టాడు. ఇక ఐపీఎల్లోనూ ఆడిన షేన్ వార్న్ 55 మ్యాచ్ల్లో 57 వికెట్లు తీశాడు.