
చాలా కష్టంగా ఉంది..
'ఇది చాలా కఠినమైన రోజు. ఈ ఓటమిని జీర్ణించుకోవడం చాలా కష్టం. కానీ వీలైనంత త్వరగా మరిచిపోయి ముందుకు సాగాల్సిన అవసరం ఉంది. పిచ్పై బంతి కదిలిక ఆశ్చర్యానికి గురి చేసింది. వికెట్ కూడా కొంచెం మగ్గీగా ఉంది. ఈ పరిస్థితులను భారత్ చక్కగా వాడుకుంది. పవర్ ప్లేలో వారు అద్భుతంగా బౌలింగ్ చేశారు. భారత్ బౌలింగ్ను ధీటుగా ఎదుర్కొవడంపై మేం చర్చించి, వర్క్ చేయాల్సిన అవసరం ఉంది. టెస్ట్ క్రికెట్లో సత్తా చాటి సూపర్ ఫామ్లో ఉన్న ఆటగాళ్లు ఈ మ్యాచ్లో విఫలమయ్యారు. దురదృష్టవశాత్తు వారి బ్యాట్కు బంతి ఎడ్జ్ తీసుకొని ఫీల్డర్ చేతిలోకి వెళ్లింది.

బుమ్రా అర్హుడు..
జస్ప్రీత్ బుమ్రా గొప్ప బౌలర్. మరీ ముఖ్యంగా మాపై చెలరేగుతాడు. ఈ రోజు అతను అద్భుతంగా బౌలింగ్ చేశాడు. బుమ్రా అందుకున్న గణంకాలకు అతను పూర్తిగా అర్హుడు. ఇక మా బౌలర్లు వికెట్లు తీయలేకపోయారు. ఎందుకంటే వికెట్లు తీయాలనే ఒత్తిడి ఉన్నప్పుడు అది సాధ్యం కాదు. ఎప్పుడైతే బౌలర్కు రిస్క్ తీసుకునే అవకాశం ఉంటుందో అప్పుడే వికెట్లు లభిస్తాయి.'అని జోస్ బట్లర్ పేర్కొన్నాడు.

బూమ్ బూమ్.. బుల్లెట్ బుమ్రా
మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్' జస్ప్రీత్ బుమ్రా (6/19) సంచలన బౌలింగ్కు, మహ్మద్ షమీ (3/31) మెరుపులు కూడా తోడవడంతో మొదట ఇంగ్లాండ్ 25.2 ఓవర్లలో 110 పరుగులకే కుప్పకూలింది. కెప్టెన్ జోస్ బట్లర్ (30; 32 బంతుల్లో 6×4) టాప్స్కోరర్. అనంతరం కెప్టెన్, ఓపెనర్ రోహిత్ శర్మ (76 నాటౌట్; 58 బంతుల్లో 7×4, 5×6) చెలరేగడం.. మరో ఓపెనర్ ధావన్ (31 నాటౌట్; 54 బంతుల్లో 4×4) కూడా నిలకడగా ఆడడంతో భారత్ 18.4 ఓవర్లలో ఒక్క వికెట్టూ నష్టపోకుండా లక్ష్యాన్ని ఛేదించింది. భారత పేసర్లు విజృంభించిన పిచ్ మీద ఇంగ్లిష్ బౌలర్లను అసలేమాత్రం లెక్క చేయలేదు రోహిత్.


Click it and Unblock the Notifications
