విరాట్ కోహ్లీ.. భారత అత్యుత్తమ ఫీల్డర్ కాదు: జాంటీ రోడ్స్
టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీపై వరల్డ్ బెస్ట్ ఫీల్డర్గా గుర్తింపు పొందిన సౌతాఫ్రికా క్రికెట్ దిగ్గజం జాంటీ రోడ్స్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. మైదానంలో దూకుడుగా ఉండే విరాట్ కోహ్లీ భారత అత్యుత్తమ ఫీల్డర్ కాదన్నాడు. విరాట్ కోహ్లీ అపరిమితమైన వేగం, ఉత్సాహం మాత్రమే ఫీల్డింగ్లో అతనిని అత్యుత్తమంగా నిలపలేవని ఒక ఇంటర్వ్యూలో జాంటీ రోడ్స్ అభిప్రాయపడ్డాడు.
కోహ్లీనే బలం, బలహీనత..
కోహ్లీ దూకుడు స్వభావంపై స్పందిస్తూ.. 'జట్టు విజయపథంలో ఉన్నప్పుడు విరాట్ కోహ్లీ ఉత్సాహం సహచరుల్లో స్ఫూర్తి నింపుతుంది. కానీ పరిస్థితులు అనుకూలించనప్పుడు కోహ్లీ చూపించే ఆగ్రహం లేదా నిరాశ డ్రెస్సింగ్ రూమ్లోని యువ ఆటగాళ్లపై మానసిక ఒత్తిడి పెంచే ప్రమాదం ఉంది. ఇలాంటి క్లిష్ట సమయాల్లో ప్రశాంతంగా ఉంటూ జట్టును నడిపించడం సీనియర్ ఆటగాడిగా ఎంతో ముఖ్యం.’అని జాంటీ రోడ్స్ చెప్పుకొచ్చాడు.

సచిన్తో కోహ్లీకి పోలిక అనవసరం..
క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్, విరాట్ కోహ్లీల మధ్య పోలిక అనవసరమని జాంటీ రోడ్స్ అన్నాడు. 'విరాట్ కోహ్లీకి తన అద్భుతమైన ఫిట్నెస్తో సచిన్ రికార్డులను అధిగమించగల సామర్థ్యం ఉంది. అయినప్పటికీ వేర్వేరు కాలాల్లో రాణించిన ఇద్దరు లెజెండ్స్ను పోల్చడం సరికాదు. వారిద్దరూ తమదైన శైలిలో భారత క్రికెట్ను ప్రపంచ స్థాయిలో నిలిపారు. వారి సక్సెస్ను ఆస్వాదించాలి. కానీ వారిని పోల్చుతూ ఎవరు గొప్పో తేల్చకూడదు.
గాయంతో దూరం..
తొడ కండరాల గాయంతో అఫ్గానిస్థాన్తో వన్డే సిరీస్కు దూరమైన విరాట్ కోహ్లీ.. ప్రస్తుతం విశ్రాంతి తీసుకుంటున్నాడు. టీ20, టెస్ట్ ఫార్మాట్స్కు రిటైర్మెంట్ ప్రకటించిన విరాట్ కోహ్లీ.. కేవలం వన్డే ఫార్మాట్లోనే కొనసాగుతున్న సంగతి తెలిసిందే. వన్డే ప్రపంచకప్ 2027 ఆడటమే లక్ష్యంగా పెట్టుకున్న కోహ్లీ.. ఆ దిశగా ముందుకు సాగుతున్నాడు. ఐపీఎల్ 2026 సీజన్లో అద్వితీయమైన ప్రదర్శనతో ఆర్సీబీ రెండో టైటిల్ గెలవడంలో కీలక పాత్ర పోషించాడు.
ఇంగ్లండ్ పర్యటనలో జరిగే వన్డే సిరీస్తో విరాట్ కోహ్లీ మళ్లీ మైదానంలోకి రీఎంట్రీ ఇచ్చే అవకాశం ఉంది. గాయం నుంచి విరాట్ కోహ్లీ వేగంగా కోలుకుంటున్నాడని బీసీసీఐ వర్గాలు పేర్కొన్నాయి.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications

