లండన్: వచ్చే నెలలో వెస్టిండీస్తో జరుగనున్న తొలి టెస్టు మ్యాచ్లో ఇంగ్లండ్ కెప్టెన్ జో రూట్ ఆడడంపై సందేహాలు మొదలయ్యాయి. మూడు మ్యాచ్ల సిరీస్లో భాగంగా ఇంగ్లండ్, వెస్టిండీస్ మధ్య జూలై 8-12 మధ్య ఏజియస్ బౌల్లో ఈ మ్యాచ్ మొదలు కానుంది. అదే సమయంలో జో రూట్ భార్య తమ రెండో బిడ్డకు జన్మనిచ్చే అవకాశాలున్నాయి. ఈ నేపథ్యంలో రూట్ సెలవుపై తన భార్య దగ్గరికి వెళ్లనున్నాడు.
అయితే కరోనా నేపథ్యంలో నిబంధనల ప్రకారం జాతీయ జట్టుతో మళ్లీ చేరాలంటే రూట్ ఏడు రోజుల స్వీయ నిర్బంధాన్ని పాటించాలి. దీంతో అతను తొలి టెస్టుకు అందుబాటులో ఉండటం కష్టమవుతుంది. అయితే ఈసీబీ తన నిబంధనలను పలుమార్లు సడలిస్తూ వస్తోంది. ఫస్ట్ టెస్ట్ సమయానికి మరోసారి మార్పులు చేసినా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు. ఈ టెస్ట్ సిరీస్ కోసం విండీస్ క్రికెటర్లు ఈ నెల 9న ఇంగ్లండ్లో అడుగుపెట్టనున్నారు. బయో సెక్యూర్ వాతావరణంలో జరిగే ఈ సిరీస్తోనే అంతర్జాతీయ క్రికెట్ పునరుద్ధరణ జరుగనుంది.
ఇప్పటికే ఇంగ్లండ్ పర్యటనకు తాము వెళ్లలేమని వెస్టిండీస్ క్రికెటర్లు డారెన్ బ్రేవో, షిమ్రోన్ హెట్మైర్, కీమో పాల్..తమ క్రికెట్ బోర్డు స్పష్టం చేసిన విషయం తెలిసిందే. వాళ్ల నిర్ణయాన్ని గౌరవించిన వెస్టిండీస్ క్రికెట్ బోర్డు (సీడబ్ల్యూఐ) ఇతర ఆటగాళ్లతో వారి స్థానాలను భర్తీ చేసింది.
నల్ల జాతీయుడి కోసం పదవి వదులుకున్న సెరీనా విలియమ్స్ భర్త!!