
మన్కడింగ్ సరైందే..
అయితే ఈసారి అశ్విన్ మన్కడింగ్కు పాల్పడకుండా గట్టిగా వారిస్తానని, క్రీడా స్ఫూర్తికి విరుద్ధంగా ఉండే ఈ చర్యను ఎట్టి పరిస్థితుల్లో ప్రోత్సహించని ఇటీవల పాంటింగ్ హామీ ఇచ్చాడు. దీంతో ఈ మన్కడింగ్ వ్యవహారంపై మరోసారి చర్చ జరిగింది. అశ్విన్ కూడా దీనిపై వివరణ ఇచ్చాడు. ఇక తాజాగా ఈ అంశంపై మాట్లాడిన భారత మాజీ పేసర్ జవగళ్ శ్రీనాథ్ మన్కడింగ్ చేయడం సరైందేనని అభిప్రాయపడ్డాడు.
బంతి వేయకముందే క్రీజును వీడే నాన్స్ట్రైక్ బ్యాట్స్మన్ను మన్కడింగ్ (రనౌట్) చేయడంలో తప్పేమీ లేదని ఈ ఐసీసీ మ్యాచ్ రిఫరీ స్పష్టం చేశాడు. ఇందులో క్రీడాస్ఫూర్తికి చోటు లేదన్నాడు. ఆ బ్యాట్స్మన్పై సానుభూతి చూపించాల్సిన అవసరం లేదని అభిప్రాయపడ్డాడు. 'డీఆర్ఎస్ విత్ యాష్' కార్యక్రమంలో శ్రీనాథ్ ఈ వ్యాఖ్యలు చేశాడు.

క్రీడాస్పూర్తి ఎందుకు..?
‘బౌలర్ ప్రధాన బ్యాట్స్మన్పై దృష్టి పెడతాడు. అలాంటప్పుడు బంతి వేసేంత వరకు నాన్ స్ట్రైకర్ క్రీజులోనే ఉండాలి. అదేం పెద్ద సమస్య కాదు. ఎందుకంటే అతడు బ్యాటింగ్ చేయడం లేదు. మరోదాని గురించి ఆలోచన లేదు. కానీ అతడు క్రీజు దాటి ప్రయోజనం పొందుతున్నప్పుడు అలా రనౌట్ చేస్తే తప్పేం లేదు. ఇందులో క్రీడాస్ఫూర్తిని తీసుకురావొద్దు. బ్యాట్స్మన్ క్రీజులోనే ఉండాలన్న దానికే నేను కట్టుబడతాను' అని ఆయన పేర్కొన్నాడు.

బౌలర్కు నష్టం..
నాన్స్ట్రైకర్ క్రీజు దాటడం వల్ల మ్యాచ్లు మలుపులు తిరుగుతాయని శ్రీనాథ్ చెప్పారు. ‘క్రీజు దాటడం వల్ల బ్యాటింగ్ చేసే జట్టుకు ప్రయోజనం కలుగుతుంది. అప్పటికే సగం దూరం పరిగెత్తితే రనౌట్ అవకాశాలు సన్నగిల్లుతాయి. ఇలాంటి చర్యల వల్ల మరో జట్టుకు నష్టం వాటిల్లుతుంది. ప్రతీ బంతికి ప్రయోజనం ఉంటుందని అనుకోలేం. కానీ ఆఖరి బంతికి ఒక పరుగు చేస్తే విజయం లభించే సందర్భాల్లో మాత్రం సమన్యాయం ఉండదు'శ్రీనాథ్ చెప్పుకొచ్చాడు.


Click it and Unblock the Notifications












