లండన్: ప్రస్తుతం ప్రపంచం మొత్తం నల్లజాతీయులపై వివక్షకు వ్యతిరేకంగా పలు ఆందోళనలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో వెస్టిండీస్ టెస్టు టీం కెప్టెన్ జేసన్ హోల్డర్ రేసిజంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఆటలో జాతివివక్షను డోపింగ్, మ్యాచ్ ఫిక్సింగ్తో సమానమైన నేరంగా పరిగణించాలని హోల్డర్ సూచించాడు. డోపర్లు, మ్యాచ్ ఫిక్సర్లకు,రేపిస్ట్లకు ఒకే కోవకు చెందుతారన్నాడు. వీళ్లందరిని ఒకేలా శిక్షించాలని కోరాడు.
'డోపింగ్, మ్యాచ్ ఫిక్సింగ్ చేసిన వారికి విధించే శిక్షే రేసిజం విషయంలోనూ ఉండాలి. అంతకన్నా చిన్న శిక్షలు ఉండటం వృథా. వీళ్లవల్ల క్రికెట్లో ఎలాంటి సమస్యలు వచ్చినా, తప్పు చేశారని తేలినా ఉపేక్షించొద్దు. యాంటీ డోపింగ్, యాంటీ కరప్షన్ బ్రీఫింగ్స్ ఉన్నట్లుగానే యాంటీ రేసిజం గురించి కూడా సిరీస్ ముందు అవగాహన కల్పించాలి'అని హోల్డర్ అభిప్రాయపడ్డాడు. వీటన్నింటిపై లోతైన అవగాహన కల్పించాలన్నాడు. తాను రేసిజం బాధితుడి కాకపోయినా.. అక్కడక్కడ జరిగిన సంఘటనలు తనను బాధించాయని చెప్పాడు. ఇక కరోనాతో నిలిచిపోయిన క్రికెట్.. వెస్టిండీస్-ఇంగ్లండ్ టెస్ట్ సిరీస్తో పున:ప్రారంభంకానున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఇంగ్లండ్లో విండీస్ ఉండగా.. జూలై 8 నుంచి మూడు టెస్ట్ల సిరీస్ ప్రారంభంకానుంది.
అసద్ బాబాయ్ ఫోర్ కొడితే.. మాలిక్ బాబా సిక్స్ కొడుతాడు.. సానియా కుమారుడి ఫన్నీ వీడియో!