ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో భాగంగా ఆస్ట్రేలియాతో జరిగిన సెమీఫైనల్లో టీమిండియా స్టార్ ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా విధ్వంసకర బ్యాటింగ్తో చెలరేగాడు. భారీ సిక్స్లతో టీమిండియా విజయాన్ని సునాయసం చేశాడు. అతను కొట్టిన 101 మీటర్ల భారీ సిక్సర్ ఈ మ్యాచ్కే హైలైట్గా నిలిచింది. అయితే ఈ సిక్సర్కు అతని ప్రియురాలుగా ప్రచారం జరుగుతున్న బ్రిటిష్ సింగ్ జాస్మిన్ వాలియా ఎగిరి గంతేయడం చర్చనీయాంశమైంది.
అంతేకాకుండా హార్దిక్ పాండ్యా అద్భుత ప్రదర్శనకు జాస్మిన్ వాలియా స్టాండింగ్ ఓవేషన్ ఇచ్చింది. ఈ మ్యాచ్కు తన స్నేహితులతో కలిసి హాజరైన జాస్మిన్ వాలియా.. వీఐపీ లాంజ్లో కూర్చొని మ్యాచ్ను ఆస్వాదించింది. నటాషా స్టాంకోవిచ్తో విడాకుల అనంతరం హార్దిక్ పాండ్యా.. జాస్మిన్ వాలియాతో డేటింగ్ చేస్తున్నట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది. అయితే ఈ వార్తలపై ఈ ఇద్దరూ ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. కానీ టీమిండియా మ్యాచ్లకు జాస్మిన్ వాలియా హాజరవ్వడం ఈ వార్తలకు బలం చేకూర్చింది.

ఈ మ్యాచ్లో అన్ని విభాగాల్లో ఆధిపత్యం చెలాయించిన టీమిండియా 4 వికెట్ల తేడాతో ఆస్ట్రేలియాను ఓడించి ఫైనల్ చేరిన విషయం తెలిసిందే. మరోసారి విరాట్ కోహ్లీ(98 బంతుల్లో 5 ఫోర్లతో 84) అసాధారణ బ్యాటింగ్తో టీమిండియా విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా 49.3 ఓవర్లలో 264 పరుగులకు ఆలౌటైంది. స్టీవ్ స్మిత్(96 బంతుల్లో 4 ఫోర్లు, సిక్స్తో 73), అలెక్స్ క్యారీ(57 బంతుల్లో 8 ఫోర్లు, సిక్స్తో 61) హాఫ్ సెంచరీలతో రాణించారు. భారత బౌలర్లలో మహమ్మద్ షమీ(3/48) మూడు వికెట్లు తీయగా.. వరుణ్ చక్రవర్తీ(2/49), రవీంద్ర జడేజా(2/40) రెండేసి వికెట్లు పడగొట్టారు.
అనంతరం లక్ష్యచేధనకు దిగిన భారత్ 48.1 ఓవర్లలో 267 పరుగులు చేసి గెలుపొందింది. సెంచరీ చేజార్చుకోగా.. శ్రేయస్ అయ్యర్(62 బంతుల్లో 3 ఫోర్లతో 45), కేఎల్ రాహుల్(34 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్స్లతో 42), హార్దిక్ పాండ్యా(24 బంతుల్లో ఫోర్, 3 సిక్స్లతో 28) కీలక ఇన్నింగ్స్ ఆడారు.
Hardik Pandya hitting a six and the cameraman shows a picture of Jasmin Walia.🤣 pic.twitter.com/WshN2IAW9d
— Vipin Tiwari (@Vipintiwari952) March 4, 2025